ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఆయన పెళ్లెప్పుడు, ఎవరిని వివాహం చేసుకుంటాడు వంటి విషయాలపై అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. సాధారణంగా ప్రభాస్ పెళ్లి అనగానే చాలా మందికి తొలుత అనుష్క శెట్టి పేరు మదిలే మెదులుతుంది.బాహుబలి, మిర్చి సినిమాలలో వారిద్దరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ అందరికి నచ్చేయడంతో వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవల వీరిద్దరికి సంబంధించి అనేక ఫొటోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. అయితే ఇటు ప్రభాస్.. అటు అనుష్క కుటుంబసభ్యులు ఎప్పటికప్పుడు వారి పెళ్లి వార్తలని ఖండిస్తూనే ఉంటారు. కృతి సనన్తో కూడా ప్రభాస్ ప్రేమాయణం నడుపుతున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. దానిని కృతి ఖండించింది.
గత కొద్ది రోజులుగా ప్రభాస్ పెళ్లిపై అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ పెళ్లిపై కృష్ణం రాజు భార్య శ్యామలదేవి.. అంటే ప్రభాస్ పెద్దమ్మ ఓ క్లారిటీ ఇచ్చారు. దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్మమ్మని దర్శించుకునేందుకు వెళ్లిన శ్యామలా దేవి .. అక్కడ మీడియా వాళ్లతో మాట్లాడింది.
అదే క్రమంలో ప్రభాస్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శ్యామలదేవిని… ప్రభాస్ పెళ్లెప్పుడు? అని మీడియా ప్రతినిధులు అడగడంతో ఆమె మాట్లాడుతూ… కృష్ణంరాజు తమతో లేకపోయినా ఆయన పేరు నిలబెడుతూ మా ఫ్యామిలీ ముందుకెళ్తోంది అని అన్నారు.. ప్రభాస్ పెళ్లి త్వరలోనే కచ్చితంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుంది. వచ్చే దసరా లోపు ప్రభాస్ ఓ ఇంటివాడు అవుతాడు అని శ్యామలా దేవి చెప్పుకొచ్చారు. అయితే, అమ్మాయి ఎవరు? డేట్ మాత్రం రివీల్ చేయలేదు కాని, త్వరలోనే శుభకార్యం ఉంటుంది’ అని శ్యామలా దేవి అన్నారు. వాస్తవానికి కృష్ణంరాజు బతికుండగానే.. ప్రభాస్ పెళ్లి చేయాలని అనుకున్నారు.
కానీ, షూటింగ్స్తో ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల అది సాధ్యపడలేదు అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే శ్యామలా దేవి గతంలో ప్రభాస్ పెళ్లి వార్తలపై స్పందిస్తూ.. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కాని అలా జరగలేదు. మరి ఇప్పుడు శ్యామలా దేవి చెప్పింది నిజమవుతుందా లేదా అనేది చూడాలి.