Suryapeta విధాత: రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటరు బీఆర్ ఎస్కు ఓటు వేయాలని డిసైడ్ అయ్యారని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సృష్టించబోతున్నారు ఆయన తేల్చిచెప్పారు. తాజాగా సూర్యాపేట పట్టణాభివృద్ధికి గాను మంజూరైన 30 కోట్లు నిధులను ఎక్కడెక్కడ వెచ్చించాలన్నఅంశంపై జగదీశ్రెడ్డి ఆదివారం సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 16వ వార్డులో పర్యటించి పరిశీలించారు. అభివృద్ధిపై సర్వత్రా […]
Suryapeta
విధాత: రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటరు బీఆర్ ఎస్కు ఓటు వేయాలని డిసైడ్ అయ్యారని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సృష్టించబోతున్నారు ఆయన తేల్చిచెప్పారు. తాజాగా సూర్యాపేట పట్టణాభివృద్ధికి గాను మంజూరైన 30 కోట్లు నిధులను ఎక్కడెక్కడ వెచ్చించాలన్నఅంశంపై జగదీశ్రెడ్డి ఆదివారం సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలోని 16వ వార్డులో పర్యటించి పరిశీలించారు.
అభివృద్ధిపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని, ఆ దిశగా ఫలితాలు రాబోతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రాధాన్యత క్రమంలో మంజూరైన నిధులను వినియోగించుకునే క్రమంలో ఆ వార్డు పరిధిలోని రహదారులను పరిశీలించారు. మంత్రి రాకను తెలుసుకున్న వార్డు పరిధిలోని ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
కాలనీల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి పట్టణాభివృద్ధికి ముందేన్నడు లేని రీతిలో 1390 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. దానికి తోడు తాజాగా 30 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఆ నిధులతో రహదారుల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.
ఏ ఒక్క కాలనీని, అంతర్గత రహదారులను విస్మరించకుండా ప్రాధాన్యాత క్రమంలో నిధులు మంజూరు చేయించి పట్టణాభివృద్ధికి కృషి చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు.