G20 | వన్ ఎర్త్..వన్ ఫ్యామిలీ..వన్ ఫ్యూచర్ ఇదే జీ-20శిఖరాగ్ర సదస్సు విజన్ సదస్సు ముగింపులో ప్రధాని మోడీ పిలుపు భద్రాతామండలిని విస్తరించాలని మోడీ ఉద్ఘాటన విధాత : భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు సాగిన జీ-20దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసల్వాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు. అధ్యక్ష పదవి మార్పిడికి చిహ్నంగా చిన్న సుత్తి వంటి గవెల్ను డసల్వా […]
G20 |
విధాత : భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు సాగిన జీ-20దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసల్వాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు. అధ్యక్ష పదవి మార్పిడికి చిహ్నంగా చిన్న సుత్తి వంటి గవెల్ను డసల్వా చేతికి మోడీ అందించారు.
ఈ సందర్భంగా ప్రపంచంలో శాంతి నెలకొనాలి.. కొత్త ఆశలు చిగురించాలి అంటూ సంస్కృత శ్లోకం ‘స్వస్తి అస్తు విశ్వ’ ప్రార్థనతో మోడీ సదస్సు ముగిసిందని ప్రకటించారు. అనంతరం సదస్సు తీర్మానాలను మోడీ ప్రకటించారు. ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తుకు సంబంధించిన విజన్ రోడ్ మ్యాప్పై చేస్తున్న కృషికి జీ-20శిఖరాగ్ర సదస్సు వేదికగా మారడం నాకెంతో సంతృప్తినిచ్చిందని సదస్సుగా ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. పలు కీలక అంశాలపై సదస్సు చర్చించిందన్నారు.
జీ-20 దేశాధినేతల మధ్య ఉక్రేయిన్ సమస్యపై విబేధాలున్నా నేటీ యుగంలో యుద్దం ఉండకూడదంటూ ఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించడం హర్షనీయమన్నారు సామాజిక భద్రత, ద్రవ్య, ఆర్ధిక స్థిరత్వం వంటి వాటికి తోడు క్రిఫ్టో కరెన్సీ అంశం కొత్తగా సదస్సులో చర్చనీయాంశమైందన్నారు. క్రిప్టోను నియత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణామాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
భద్రాతా మండలిని విస్తరించాల్సిందే : ప్రధాని మోడీ
ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని మోడీ పేర్కోన్నారు. సభ్య దేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికి ఐక్య రాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మారడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
51దేశాలతో ఐక్యరాజ్య సమితి ఏర్పడినసమయంలో పరిస్థితులు వేరని, ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 200కు చేరువైందన్నారు. కాలానుగుణంగా ఎవరైతే మార్పు చెందరో వారు ప్రాముఖ్యాన్ని కోల్పోతారని మోడీ స్పష్టం చేశారు. భద్రతా మండలి విస్తరణ అంశాన్ని జీ-20ముగింపు వేదికగా మోడీ నొక్కిచెప్పారు.
Productive discussions at the G20 Summit for a better planet… pic.twitter.com/rNSOOHpB5L
— Narendra Modi (@narendramodi) September 10, 2023
నవంబర్లో.. వర్చువల్ సమాశాలకు మోడీ సూచన
భారత్లో నిర్వహించిన జీ-20శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన తీర్మానాలు, సిఫారసులను సమీక్షించేందుకు నవంబర్ నెల చివర్లో వర్చువల్ సమావేశం నిర్వహించాలని సభ్య దేశాధినేతలకు ప్రధాని మోడీ సూచించారు. నవంబర్ 30వరకు జీ-20కి భారత నాయకత్వమే కొనసాగనున్నందునా, అధ్యక్ష హోదాలో మరిన్ని కార్యకలాపాలు పూర్తి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
గత రెండు రోజుల్లో ఈ సదస్సులో మీరు మీ అభిప్రాయలు, సూచనలు, ప్రతిపాదనలు అందించారని, వాటిని విశ్లేషించడం, వేగవంతం చేయడం మా బాధ్యతగా భావిస్తున్నామని మోడీ పేర్కోన్నారు. కాగా జీ-20దేశాల శిఖారాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని మోడీకి బైడెన్ సహా బ్రెజిల్, ప్రాన్స్ తదితర సభ్య దేశాధినేతలు తమ అభినందనలు తెలిపారు.
Stronger together. Stronger united