Minister Harish Rao | విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర అసెంబ్లీకి బీఆర్ఎస్ ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించారని, దీంతో ప్రతిపక్షాలు కకావికలం అవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం మెదక్ లో నూతన కలెక్టరేట్, ఎస్పీ, కార్యాలయాల ను సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అధికారులతో కలిసి […]
Minister Harish Rao |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర అసెంబ్లీకి బీఆర్ఎస్ ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించి సంచలనం సృష్టించారని, దీంతో ప్రతిపక్షాలు కకావికలం అవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం మెదక్ లో నూతన కలెక్టరేట్, ఎస్పీ, కార్యాలయాల ను సీఎం ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు క్యాండిడేట్స్ లేరని, బీజేపీ కి క్యాడర్ లేదన్నారు.
కాంగ్రెస్ టికెట్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీ డీలాపడు పోయిందన్నారు. సీఎం కేసీఆర్ అధ్వర్యంలో మెదక్ జిల్లా గా ఏర్పడిందని, జిల్లాకు సాగు, తాగునీటిని అందించిన ఘనత ఆయనదేనని అన్నారు. ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ప్రతిపక్షాల గ్లోబెల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. దేశవ్యాప్తంగా రైతులు కేసీఆర్ పథకాలు కావాలని కోరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్ నుండే ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు.
సభా ఏర్పాట్ల పరిశీలన
నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ, కార్యాలయాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరిగే ప్రాంగణాన్ని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఇఫ్ఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.