విధాత: బుల్లితెర నటులు అని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే వారికి బడా బడా స్టార్స్ కంటే ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటున్నది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు చూసే వాళ్ళ కన్నా.. టీవీలలో సీరియల్స్ చూసే వాళ్ళే ఎక్కువయ్యారంటే అతిశయోక్తి కానే కాదు. సాయంత్రం అయితే చాలు టీవీలలో, ఇప్పుడు కొత్తగా సెల్ఫోన్స్లో సీరియల్స్, ఇతర ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. దాంతో బుల్లితెర నటీనటులు థియేటర్ల నటీనటుల కంటే ముందుగా ప్రేక్షకుల ఇళ్లలోకి వస్తున్నారు.. నట్టింట్లో తిష్ట […]
విధాత: బుల్లితెర నటులు అని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే వారికి బడా బడా స్టార్స్ కంటే ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటున్నది. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు చూసే వాళ్ళ కన్నా.. టీవీలలో సీరియల్స్ చూసే వాళ్ళే ఎక్కువయ్యారంటే అతిశయోక్తి కానే కాదు.
సాయంత్రం అయితే చాలు టీవీలలో, ఇప్పుడు కొత్తగా సెల్ఫోన్స్లో సీరియల్స్, ఇతర ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. దాంతో బుల్లితెర నటీనటులు థియేటర్ల నటీనటుల కంటే ముందుగా ప్రేక్షకుల ఇళ్లలోకి వస్తున్నారు.. నట్టింట్లో తిష్ట వేసుకుంటున్నారు. దాంతో సినిమా వారి కన్నా బుల్లితెర, ఓటీటీ వంటివి ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నాయి.
స్టార్ హీరోల చిత్రాలు చూడాలంటే అది ఓ పెద్ద తతంగం, ముందుగా టిక్కెట్ కొనాలి. తర్వాత ఇంటి నుంచి థియేటర్ వరకు వెళ్లాలి. ఆ మల్టీప్లెక్స్లో ఇంటర్వెల్లో ఏదో ఒకటి తిని, కూల్ డ్రింక్ తాగాలి. సినిమాకు వెళ్లేటప్పుడు ఉండే ఉత్సాహం తిరిగి వచ్చేటప్పుడు ఉండదు. వాటిన్నింటి వల్ల బుల్లితెర అనేది నేడు రిలాక్స్ కలిగించే విషయంలో టాప్ ప్రయారిటీని సొంతం చేసుకుంటుంది.
ఇక ఓటీటీలు, ఇతర శాటిలైట్ చానెల్స్ వరకు అందరు వీక్షించడంలో మునిగి పోయారు. దాంతో వీరాభిమానులు మినహా మిగిలిన మధ్య తరగతి వారు శాటిలైట్, ఓటీటీలకే ఓటు వేస్తున్నారు. టీవీ షోలు ఏదో సాదాసీదాగా చూడరని కొందరి భావన. అందుకే జనాలను ఆకట్టుకోవడానికి ప్రోమోలలో సంథింగ్ స్పెషల్గా చూపించాలనే భావనలో మేకర్స్ ఉన్నారు. అందుకే ప్రోమోలలో ఏదో ఒక కాంట్రవర్సీని సృష్టించి దాని మీద షోలపై ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా చెప్పుకునే షోలలో ఈటీవీలో వచ్చే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. దీని ఆర్గనైజర్స్ అయితే కాంట్రవర్సీ ప్రోమోలు కట్ చేయడంలో దిట్ట అని చెప్పాలి.
ప్రతీసారి ఇద్దరు యాక్టర్స్ మధ్య గొడవ పెట్టడం… ఒకరిని ఒకరితో తిట్టించడం లాంటి పనులు చేస్తుంటారు. ఈ విషయంలో నెటిజన్స్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ షో ఫార్మేట్లో పెద్దగా మార్పేం లేదు. అయితే తాజాగా జరిగింది మిగిలిన వాటి కంటే ఓ ఎత్తు ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇందులోకి వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి.. ఒకరి చెంపపై మరో నటి గట్టిగా కొట్టింది.
విషయంలోకి వస్తే.. వచ్చే ఆదివారం ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు పేరుతో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోని టెలికాస్ట్ చేయనున్నారు. ఇందులో ఆదితో పాటు సీరియల్ యాక్టర్స్ భావన, కరణ్ భూషన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బంతిని తీసుకొచ్చి యాంకర్ రష్మీకి ఇచ్చిన వారు విన్ అవుతారు.
అలా ఆ రౌండ్లో భావన గెలిచింది. ఎందుకంటే ఎదురుగా ఉన్న కరుణ చెంపపై కొట్టింది. ఇక ఈ ఎపిసోడ్ లోనే జబర్దస్త్ పవిత్ర జుట్టుని కూడా ఎవరో కత్తిరించారు. ఇలా సంథింగ్ సంథింగ్ ఇంట్రెస్ట్ అనిపించేలా ఉన్న ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతుంది. జుట్టు పీక్కునే వరకు వచ్చారు.. ఇంకా ఎన్ని చూడాలో.. అంటూ నలుగురు మాట్లాడుకునేలా చేస్తోంది.