ఇన్వెస్టర్స్ సమ్మిట్లో తేల్చేసిన జగన్ ! విధాత: ముఖ్యమంత్రి జగన్ తేల్చేశారు. విశాఖను రాజధానిగా చేస్తున్నట్లు, తాను కూడా తొందరలోనే విశాఖ పయనం అవుతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇన్వెష్టర్లు అక్కడికే వచ్చి ఏపీ ప్రగతిలో భాగం కావాలని కోరారు. మార్చిలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 31న ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సు నిర్వహించారు.. అందులో ఇన్వెస్టర్లను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ. ఏపీలో పెట్టుబడులు […]
ఇన్వెస్టర్స్ సమ్మిట్లో తేల్చేసిన జగన్ !
విధాత: ముఖ్యమంత్రి జగన్ తేల్చేశారు. విశాఖను రాజధానిగా చేస్తున్నట్లు, తాను కూడా తొందరలోనే విశాఖ పయనం అవుతున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇన్వెష్టర్లు అక్కడికే వచ్చి ఏపీ ప్రగతిలో భాగం కావాలని కోరారు. మార్చిలో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జనవరి 31న ఢిల్లీలో ఇందుకు సంబంధించిన సన్నాహక సదస్సు నిర్వహించారు.. అందులో ఇన్వెస్టర్లను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ. ఏపీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ గత మూడేళ్లుగా నెంబర్ వన్గా ఉంటోందని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 11 ఇండస్ట్రీయల్ కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభ పరిణామంగా అభివర్ణించారు.
సింగిల్ డెస్క్ విధానం ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందని జగన్ తేల్చిచెప్పారు. తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో విశాఖ రాజధానిలో పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. మొత్తానికి తాను అనుకున్నది చేసేందుకు జగన్ సిద్ధమయ్యారన్నమాట. ప్రతిపక్షాలు.. కోర్టులు.. కొందరు అసంతృప్త అధికారులు..ఇలా ఎంతోమంది పరిపరి విధాలా అడ్డంకులు కలిగిస్తున్నా జగన్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదని అంటున్నారు.
ఇప్పటికే పలు విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు సిద్ధం చేసిన ప్రభుత్వం సీఎం క్యాంప్ కార్యాలయాన్ని సైతం ఋషికొండలో ఏర్పాటు చేస్తోంది. ఇక మెల్లగా వివిధ విభాగాలను తరలించడమే తరువాయి అంటున్నారు.