Warangal | CP కమిషనరేట్ పరిధిలో 89 సెంటర్లు పటిష్టమైన భధ్రతా చర్యలు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టెన్త్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ నేపథ్యంలో ఈ పరీక్షకు మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు. చిన్న పొరపాటుకు తావివ్వకుండా […]
Warangal | CP
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టెన్త్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ నేపథ్యంలో ఈ పరీక్షకు మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు.
చిన్న పొరపాటుకు తావివ్వకుండా గట్టి చర్యలు చేపట్టినట్టు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలను వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు.
ఇదిలా ఉండగా అవసరమైన చర్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పరీక్ష సెంటర్ల వద్ద చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో శనివారం కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు.
ఈ సమవేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న ఈ పరీక్షకు 34,162 మంది అభ్యర్థులు హాజరువుతుండగా, కమిషనరేట్ పరిధిలో మొత్తం 89 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సెంట్రల్ జోన్ పరిధిలో 70, ఈస్ట్ జోన్ పరిధిలో 5, వెస్ట్ జోన్ పరిధిలో 14 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారని వివరించారు. ఈ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు పరీక్షా కేంద్రానికి ఐదు వందల మీటర్ల పరిధిలో ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సెక్షన్ 144 అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసి వేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ అదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు పోలీసు కమిషనర్ పలు సూచనలు చేశారు.
1.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించి రావల్సి వుంటుంది. బూట్లు, బెల్ట్ ధరించి వచ్చే అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించరు.
2.ఉదయం 8.30 గంటల నుండి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 10.15 తరువాత అభ్యర్థులను ఎవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
3. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి తమ బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మరియు హాల్ టికెట్, ఏదేని గుర్తింపు కార్డును మాత్రమే తీసుకరావల్సి వుంటుంది.
4. అభ్యర్థులు తమ వెంట ఎలాంటి వస్తువులు అనగా సెల్ఫోన్లు, చేతి గడియారాలు, హెడ్ఫోన్స్, బ్యాగులు తీసుకరావద్దు.
5. పరీక్ష సమయం ముగిసిన అనంతరమే అభ్యర్థులను పరీక్ష గది బయటకి అనుమతిస్తారు.
6. అభ్యర్థులను ముందుగా క్షుణ్ణంగా తనీఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారు.
7. దివ్యాంగులకు పరీక్ష వ్రాసే వ్యక్తులు, సంబంధిత అధికారులు జారీచేసిన పత్రాలతో పరీక్షా కేంద్రానికి హాజరు కావల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.
ఈ సమావేశంలో క్రైమ్ డిసిపి మురళీధర్, సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారీ, ఈస్ట్ జోన్ డిసిపి కరుణాకర్, వెస్ట్ జోన్ డిసిపి సీతారాం, అదనపు డిసిపి సంజీవ్తో పాటు ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గొన్నారు.