దొంగ‌త‌నానికి వ‌చ్చి.. భ‌ర్త క‌ళ్లెదుటే భార్య‌పై సామూహిక అత్యాచారం

Rajasthan |విధాత: దోపిడీ దొంగ‌లు దారుణానికి పాల్ప‌డ్డారు. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించిన దొంగ‌లు దొరికిన కాడికి దోచుకున్నారు. ఆ త‌ర్వాత భ‌ర్తను క‌ట్టేసి, భార్య‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని సిరోహి జిల్లాలో బుధ‌వారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. పిండ్వారా డీఎస్పీ జితూ సింగ్ క‌థ‌నం ప్ర‌కారం.. ఓ ఇద్ద‌రు దంప‌తులు కూలీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. అయితే భ‌ర్త వాచ్‌మెన్‌గా కూడా ప‌ని చేస్తున్నాడు. బుధ‌వారం రాత్రి ఇద్ద‌రు […]

  • Publish Date - November 13, 2022 / 04:36 PM IST

Rajasthan |విధాత: దోపిడీ దొంగ‌లు దారుణానికి పాల్ప‌డ్డారు. ఓ ఇంట్లోకి ప్ర‌వేశించిన దొంగ‌లు దొరికిన కాడికి దోచుకున్నారు. ఆ త‌ర్వాత భ‌ర్తను క‌ట్టేసి, భార్య‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని సిరోహి జిల్లాలో బుధ‌వారం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

పిండ్వారా డీఎస్పీ జితూ సింగ్ క‌థ‌నం ప్ర‌కారం.. ఓ ఇద్ద‌రు దంప‌తులు కూలీ ప‌నులు చేసుకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. అయితే భ‌ర్త వాచ్‌మెన్‌గా కూడా ప‌ని చేస్తున్నాడు. బుధ‌వారం రాత్రి ఇద్ద‌రు దంప‌తులు నిద్ర‌కు ఉపక్ర‌మించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అంత‌లోనే ఓ న‌లుగురు దొంగ‌లు వారి ఇంట్లోకి ప్ర‌వేశించారు. వాచ్‌మెన్ వ‌ద్ద రూ.1400లు దొంగిలించారు. ఇంట్లో న‌గ‌దు, విలువైన వ‌స్తువులు ఉంటే ఇవ్వాల‌ని దొంగ‌లు డిమాండ్ చేశారు. త‌మ వ‌ద్ద వెండి ఆభ‌ర‌ణాలు త‌ప్ప బంగారం లేద‌ని చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ దొంగ‌లు వారి మాట‌ల‌ను వినిపించుకోలేదు. వాచ్‌మెన్‌ను క‌ట్టేసి, భార్య‌ను వివస్త్రను చేసి అనంత‌రం ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. బాధిత దంప‌తులు శుక్ర‌వారం పోలీసుల‌కు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. న‌లుగురిలో ముగ్గురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

Latest News