నేను వైఎస్సాఆర్ రక్తం: ఏపీసీసీ చీఫ్ షర్మిల

నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తం. రాజశేఖర్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది’ అని షర్మిల అన్నారు

  • Publish Date - January 26, 2024 / 10:49 AM IST

  • ఆయన ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరా
  • నా స్వార్థం కోసం పాదయాత్ర చేయలేదు

విధాత: ‘నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తం. రాజశేఖర్ రెడ్డి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది’ అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. వైఎస్సార్ ఆశయాల కోసమే తను కాంగ్రెస్ లో చేరినట్లు స్పష్టం చేశారు. మనవడు రాజారెడ్డికి ఆపేరు పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. ఎవరో తనకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదు.. కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదు అని చెప్పుకొచ్చారు.


నిజం ఎప్పుడు నిలకడగా నిలుస్తుందని అన్నారు. తన దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు.. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు.. నా పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని షర్మిల ఆక్షేపించారు. భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర తను చేశానట.. నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట, జైల్లో అధికారి చెప్పాడట.. దమ్ముంటే అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించ గలరా?’ అంటూ షర్మిల్ నిలదీశారు. దేవుడు మీద ప్రమాణం చేయగలరా? అంటూ ప్రశ్నించారు. ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రమాణం చేసి చెప్పగలను.. నాకు నేనుగా ఎప్పుడు పాదయాత్ర చేయలేదు. నన్ను అడిగితే తప్పా నేను పాదయాత్ర చేయలేదు అని చెప్పారు.


మేము అక్రమ సంపాదనకి స్కెచ్ వేశామని చెప్తున్నారని, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే విజయమ్మ గారితో మాత్రమే వెళ్లినట్లు తెలిపారు. తన భర్త అనిల్ ఒక్క రోజు కూడా జగన్ రెడ్డిని కలవలేదన్నారు. తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడు.. నిజం తెలుస్తుందని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్న.. దమ్ముంటే ఇది నిజమో? కాదో? అమ్మ విజయమ్మతో చెప్పించండి అంటూ వైసీపీ నేతలకు హితవు పలికారు.

Latest News