రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌. షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నామన్నారు.

  • Publish Date - June 5, 2024 / 03:53 PM IST

రాష్ట్ర ప్రయోజనాల షరతులతోనే ఎన్డీఏకు మద్దతునివ్వాలని డిమాండ్‌

విధాత : ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్‌. షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకరావాలని, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం జరగాలని, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని, సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని పేర్కోన్నారు. ప్రజలు ఇచ్చిన ఇంత పెద్ద మెజారిటీతో ముందుకు ఎలా అడుగు వేయాలో టీడీపీ కూటమి నేతలు ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం ఆలోచన చేసి, ప్రత్యేక హోదా సహా అన్ని విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ కూటమి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ, జనం గొంతుకగా మారిన కాంగ్రెస్ పార్టీ ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందని స్పష్టం చేశారు.

Latest News