న్యూఢిల్లీ : హింసాకాండతో అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని ఇన్నర్ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమల్ అకోయిజాం తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన సోమవారం అర్ధరాత్రి లోక్సభలో మాట్లాడుతూ.. ‘ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ పట్టదనే అంశాన్ని ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు, ప్రత్యేకించి మణిపూర్ ప్రజలకు మీ మౌనం సంకేతాలనిస్తున్నదా?’ అని నిలదీశారు. ఇకనైనా ప్రధాన మంత్రి మణిపూర్ విషయంలో నోరు విప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ప్రసంగంలో మణిపూర్ హింస అంశం లేకపోవడాన్ని బిమల్ అకోయిజాం ప్రశ్నించారు. ఇది కేవలం ప్రసంగంలో విస్మరించిన అంశంగా పరిగణించరాదన్నారు. 60వేల మంది ప్రజలు ఏడాదిగా సహాయ శిబిరాల్లో నానా కష్టాలు పడుతున్న అంశాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ‘60వేల మంది నిరాశ్రయులైన అంశం ఆషామాషీ కాదు. 200 మందికిపైగా చనిపోయారు. అంతర్యుద్ధ తరహా పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. ఒంటి నిండా ఆయుధాలు వేసుకుని అక్కడ ప్రజలు తిరుగుతున్నారు. తమ గ్రామాలను రక్షించుకునేందుకు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాదిగా మౌన ప్రేక్షకుడిలా చూస్తూ నిలుచున్నది’ అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు సహా సభలో ఎవరూ లేని సమయంలో తనకు మాట్లాడేందుకు సమయం కేటాయించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మోదీజీ.. మణిపూర్పై ఇకనైనా నోరు విప్పండి : మణిపూర్ ఎంపీ అంగోమ్చా బిమల్ అకోయిజాం
హింసాకాండతో అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని ఇన్నర్ మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ అంగోమ్చా బిమల్ అకోయిజాం తీవ్రంగా దుయ్యబట్టారు.

Latest News
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.. సచిన్ రికార్డు బ్రేక్
మరమ్మతులు పూర్తయ్యాకే కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ : మంత్రి ఉత్తమ్
వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు మూడు నెలల వేతన బకాయిలు చెల్లించండి!
జూలై 20నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
‘సర్’పై సుర్రుమంటున్న జనం.. ఫారాలు అందక ఎదురుచూపులు
కావేరి నది జలాలకు తమిళ ప్రజల సాంప్రదాయ పూజలు..వైరల్
ఒవైసీ కాలేజీ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్
ఇదేమి చోద్యం…హమామ్ సబ్బుతో పాముకు స్నానం..వైరల్ వీడియో
క్యాన్సర్ మందు అమెరికాలో రూ.85వేలు..భారత్ లో రూ.35: అమెరికన్ మహిళ వీడియో వైరల్
హైదరాబాద్ లో ఫుడ్ కల్తీపై 185 కేసుల నమోదు !