విధాత : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. యాత్రికులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపి వేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. అమర్నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్కు పడిపో వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3,800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1.50 లక్షలు దాటింది. అనంతనాగ్లోని సున్వాన్-వహల్దామ్ మార్గం, గందర్బాల్లో బల్తాల్ మార్గాల గుండా జూన్ 29న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. ఆగస్టు 19న ముగుస్తుంది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ లోని మంచు లింగాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.
అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ … వర్షాల నేపథ్యంలో నిర్ణయం
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. యాత్రికులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు

Latest News
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా… ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు: ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్
సింధూ లోయ పశుపతి ముద్రపై కొత్త రచ్చ !
కాక్రోచ్ జనతా పార్టీ తొలి టార్గెట్ ధర్మేంధ్ర ప్రధాన్ .. ధర్నాకు పిలుపు
జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త: రాహుల్ గాంధీ హెచ్చరిక
Pooja Hegde | అభిమానిని పట్టించుకోలేదంటూ ట్రోలింగ్.. అసలు నిజం చెప్పిన పూజా హెగ్డే!
విపత్తు నిర్వహణకు రూ.1000 కోట్లు వినియోగించండి : సీఎం రేవంత్ రెడ్డి
గో బ్యాక్ మిస్టర్ పవన్ కళ్యాణ్ : కవిత ఫైర్
నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు