విధాత : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. యాత్రికులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపి వేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. అమర్నాథ్ ఆలయ గుహ, శేషనాగ్ శిఖరం వద్ద ఉష్ణోగ్రత గరిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని, ఇక రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెల్సియస్కు పడిపో వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3,800 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ క్షేత్రాన్ని సందర్శించి, సహజసిద్ధంగా ఏర్పడిన మంచు లింగాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య 1.50 లక్షలు దాటింది. అనంతనాగ్లోని సున్వాన్-వహల్దామ్ మార్గం, గందర్బాల్లో బల్తాల్ మార్గాల గుండా జూన్ 29న ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర.. ఆగస్టు 19న ముగుస్తుంది. గత ఏడాది 4.5 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ లోని మంచు లింగాన్ని దర్శించుకుని ప్రార్థనలు చేశారు.
అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ … వర్షాల నేపథ్యంలో నిర్ణయం
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. యాత్రికులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు

Latest News
షాకింగ్.. ఢిల్లీ మెట్రో ప్లాట్ఫామ్పైనే మూత్ర విసర్జన చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు
భూ చట్టాల అమలు లోసుగులతోనే భూ వివాదాలు జఠిలం : ఈటెల రాజేందర్
కింగ్ కోబ్రా క్యాచింగ్.. బిగ్ డేరింగ్ !
తెలుగు రాష్ట్రాల ఆర్టీసీకి రికార్డు స్థాయిలో సంక్రాంతి రాబడి!
ఫ్రాన్స్పై ట్రంప్ కన్నెర్ర.. 200 శాతం టారిఫ్లు విధిస్తానంటూ బెదిరింపులు
మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి పోటీ!
సరసాల డీజీపీ అధికారిని సస్పెండ్ చేసిన కర్ణాటక సర్కార్
రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. కారణం ఇదే..?
చైనాలో జనాభా సంక్షోభం.. భారీగా తగ్గిన జననాల రేటు.. 1949 తర్వాత ఇదే తొలిసారి
అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం..