Vande Bharat Sleeper | భారతీయు రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే 20కిపైగా మార్గాల్లో పరుగులు పెడుతుండగా.. త్వరలోనే మరికొన్ని రూట్లలో ప్రారంభించనున్నది. అయితే, ఇప్పటి వరకు వందే భారత్లో రైళ్లలో కేవలం చైర్కార్ సీట్లు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే స్లీపర్ క్లాస్ రైలును పట్టాలెక్కించనున్నది. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ముంబయి - ఢిల్లీ మార్గంలో నడువనున్నది. ప్రస్తుతం రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నది. […]
Vande Bharat Sleeper |
భారతీయు రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే 20కిపైగా మార్గాల్లో పరుగులు పెడుతుండగా.. త్వరలోనే మరికొన్ని రూట్లలో ప్రారంభించనున్నది. అయితే, ఇప్పటి వరకు వందే భారత్లో రైళ్లలో కేవలం చైర్కార్ సీట్లు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే స్లీపర్ క్లాస్ రైలును పట్టాలెక్కించనున్నది.
దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు ముంబయి – ఢిల్లీ మార్గంలో నడువనున్నది. ప్రస్తుతం రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నది. పనులు చివరి దశలోగా ఉండగా.. త్వరలోనే దేశ రాజధాని, ఆర్థిక రాజధాని మధ్య నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టనున్నది. ఈ ఏడాదిలోనే రైలును ప్రారంభించే అవకాశాలున్నాయని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
ముంబయి – ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం దాదాపు 16 గంటలు. దీన్ని 12 గంటలకు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు 2017-18లో ఆమోదించారు. అప్పటి నుంచి ముంబయి – ఢిల్లీ మధ్య వంతెనలు, ట్రాక్లను బలోపేతం చేయడంతో పాటు రైల్వేశాఖ ఆధునికీకరిస్తున్నది. ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్-కాంటిలివర్తో పాటు కవచ్ వ్యవస్థ, ట్రాక్ల ఫెన్సింగ్ పనులు జరుగుతున్నాయి. మిషన్ రాఫ్తార్లో భాగంగా ఈ మార్గంలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా తయారు చేస్తున్నారు.
ముంబయి సెంట్రల్ నుంచి నాగ్డా వరకు 694 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వడోదర నుంచి అహ్మదాబాద్ మధ్య 100 కి.మీ పనులు కూడా జరుగుతున్నాయి. 195 కి.మీ రక్షణ గోడలో 30 కి.మీ పనులు పూర్తయ్యాయి. ముంబయి నుంచి అహ్మదాబాద్ వరకు 570 కిలోమీటర్ల మేర మెటల్ బారియర్ ఫెన్సింగ్ పనులు 474 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. పశ్చిమ మధ్య రైల్వే ద్వారా నాగ్డా నుంచి మధుర వరకు 545 కి.మీ. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.2664 కోట్లుగా అంచనా వేశారు.
86 వందే భారత్ రైళ్లను తయారు చేసేందుకు ఐసీఎఫ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇందులో స్లీపర్ వెర్షన్ ఉండదని, వీలైనంత త్వరగా వాటి ప్రోటోటైప్ను సిద్ధం చేస్తామన్నారు. వచ్చే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందులో సిట్టింగ్ వెర్షన్ నుంచి స్లీపర్ వెర్షన్, మెట్రో వెర్షన్ సైతం ఉన్నాయి. అదే సమయంలో లోకల్ రైళ్ల ప్లేస్లో మెట్రో వర్షెన్ను తీసుకురాబోతున్నది.