విధాత :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణలో సహచర మంత్రులు, పార్టీ నాయకులు, రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఎవరికి ఇవ్వవలసిన సందేశం వారికి ఇచ్చారు. ఏకంగా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. రాష్ట్రాలలో పార్టీ విస్తరణ అవకాశాలు,అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏడుగురికి కాబినెట్ మంత్రులుగా ప్రమోషన్ ఇచ్చారు. కొత్తగా తీసుకున్న 36 మందిలోమహిళలు,ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓబీసీలకు ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అదేసమయంలో అన్ని వర్గాలనుంచి యువతకు ఎత్తు పీట వేశారు. అలాగే, […]
విధాత :ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణలో సహచర మంత్రులు, పార్టీ నాయకులు, రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఎవరికి ఇవ్వవలసిన సందేశం వారికి ఇచ్చారు. ఏకంగా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు. రాష్ట్రాలలో పార్టీ విస్తరణ అవకాశాలు,అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏడుగురికి కాబినెట్ మంత్రులుగా ప్రమోషన్ ఇచ్చారు. కొత్తగా తీసుకున్న 36 మందిలోమహిళలు,ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓబీసీలకు ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. అదేసమయంలో అన్ని వర్గాలనుంచి యువతకు ఎత్తు పీట వేశారు. అలాగే, ముఖ్యమంత్రులకు కూడా స్థానచలనం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. ఒక విధంగా కమల దళంలో తరం మార్పుకు మోడీ శ్రీకారం చుట్టారు.
అలా సంకేతాలు అందుకున్న ముఖ్యమంత్రులలో, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ముందువరసలో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. నిజానికి, యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు చాలా కాలంగా సాగుతున్నాయి. కేంద్ర నాయకత్వం కూడా అందుకు సుముఖంగా ఉందన్న వార్తలు చాలా కాలంగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణను అవకాశంగా తీసుకుని యడ్డీనిని తప్పించేందుకు అగ్రత్రయం పావులు కదిపిందని సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సదానంద గౌడ్ కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించి సొంత రాష్ట్రానికి పంపారు, యడియూరప్ప వర్గానికి చెందిన శోభా కరంర్లాజేకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. అలాగే, మరో ఇద్దరు యడ్డీవర్గం ఎంపీలకు కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఇక, మిగిలింది, యద్యూరప్పను తప్పించి ఆయన స్థానంలో ఆయన సన్నిహితుడు సదానంద గౌడను ముఖ్యంత్రినే చేయడం మాత్రమే అని పార్టీ వర్గాల సమాచారం.
ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకున్న వెంటనే యద్యూరప్పను ఆంద్ర ప్రదేశ్ గవర్నర్’గా నియమించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. గవర్నర్’గా వెళ్లేందుకు యడ్యూరప్పకు ఇష్టం లేక పోయినా, ఒప్పుకోక తప్పని విధంగా అమిత్ షా వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. అలాగే, అలా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆయన చేతిలో ఏపీ గవర్నర్ నియామక పత్రాలు ఉంచేలా ఏర్పట్లు చేసినట్లు తెలుస్తోంది .
ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో యడ్యూరప్పను నియమించాలని మోడీ, షా, నడ్డా త్రయం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.నిజానికి బిశ్వభూషణ్ హరిచందన్’ను గవర్నర్ పదవి నుంచి తప్పిస్తారని, ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్ళిన సమయంలోనే పుకార్లు షికారు చేసాయి. అలాగే ఇటీవల నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరుపట్ల ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏపీ గవర్నర్’ గా యడ్యూరప్ప నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అభ్యంతరం ఉండక పోవచ్చుని న్తున్నారు. అంతేకాదు, గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ రెడ్డి యడియూరప్ప ఇద్దరికీ కావలసిన వ్యక్తి, కామన్ ఫ్రెండ్ కావడంతో యడ్యూరప్ప నియామకం జగన్ రెడ్డి కోసం, ఆయన కోరిక మేరకు జరుగుతోందా అన్న అనుమానాలు కూడా లేక పోలేదు. అదే జరిగితే తెలుగు దేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఇతర ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి..