Site icon vidhaatha

Warangal: ఒక్కటైన ఖండాంతర ప్రేమికులు.. హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి

విధాత, వరంగల్: ఖండాలు దాటి దేశాలు వేరైనప్పటికీ తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఇరువురి కుటుంబ సభ్యులను ఓప్పించి వరంగల్ కీర్తి గార్డెన్లో ఆదివారం మూడుముళ్ల బంధంతో అమెరికా అబ్బాయి..వరంగల్ అమ్మాయి ఒకటయ్యారు. ఈ నూతన జంటను కుటుంబ సభ్యులను బంధుమిత్రులు ఆశీర్వదించారు.

వరంగల్ నగరంలోని కాశీబుగ్గకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు , మాజీ కౌన్సిలర్ దూపం సంపత్ -పద్మ దంపతుల రెండో కూతురు సుప్రియ గత ఐదు సంవత్సరాల క్రితం ఫామ్ డి కోర్స్ చేసి పై చదువుల కొరకు అమెరికాలోని ఇండియానా వెళ్ళింది. అదే కాలేజీలో చదువుతున్న గ్రాండ్ సుప్రియ ఇద్దరు ప్రేమించుకున్నారు.

గ్రాండ్ తల్లి నాన్సీ మయర్ తండ్రి జెప్ మయర్ తల్లిదండ్రులను ఒప్పించి వరంగల్లో పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకొని ఆదివారం ఉదయం 10:45 నిమిషాలకు కీర్తి గార్డెన్స్ లో వేదమంత్రాల సాక్షిగా ఒకటయ్యారు. ఈ ప్రేమజంట వివాహానికి గ్రాండ్ చెల్లెలు కూడా హాజరయ్యారు.

Exit mobile version