విధాత : బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వెనుకబడటంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న 400సీట్ల అంచనాలకు భారీ గండి పడింది. చివరకు అయోధ్య రామాలయం కొలువైన ఫైజాబాద్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి దిశగా సాగుతుంది. యూపీలోని మొత్తం 80స్థానాల్లో బీజేపీ 34స్థానాల్లో, ఎస్పీ 34స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఆరెఎల్డీ 2, ఏఎస్పీకేఆర్ 1స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే యూపీలో బీజేపీ 27స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజార్టీ మార్కు 272 సీట్లను కూడా అందుకోలేని దుస్థితిలో పడిపోయింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న యూపీతో పాటు మహారాష్ట్ర, బీహార్, హర్యానా రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది.
అయోధ్య ఫైజాబాద్లోనూ బీజేపీ వెనుకంజ
యూపీ దెబ్బకు బీజేపీ గిలగిల సొంతంగా మెజార్టీ మార్కు చేరుకోలేని దుస్థితి.బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వెనుకబడటంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న 400సీట్ల అంచనాలకు భారీ గండి పడింది.

Latest News
అండర్19 ప్రపంచకప్: మల్హోత్రా సెంచరీతో భారత్ విజయం… కివీస్పై పాక్ దూకుడు
బీఆర్ ఎస్ లోకి అరూరి పునరాగమనంలో ఆంతర్యం!?
నగదు రహిత చికిత్సలకు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి : లచ్చిరెడ్డి
మేడారం సంరంభం.. 28 నుంచి వనదేవతల జనజాతర
బ్రిటన్ ప్రధానుల ఫోన్లు హ్యాక్ అయ్యాయా? సంచలనం రేపుతున్న టెలిగ్రాఫ్ కథనం
మున్సి‘పోల్స్’లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ? బీజేపీ నామమాత్రమేనా...
2025లో టాప్ 10 భయంకర విమాన మార్గాలు ఇవే.!
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల కలకలం
రాష్ట్రంలో విజయవంతంగా ముగిసిన పులుల గణన సర్వే
భారత–ఐరోపా సమాఖ్యల చరిత్రాత్మక ఒప్పందం : అన్ని ఒప్పందాలకు అమ్మ