విధాత : బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వెనుకబడటంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న 400సీట్ల అంచనాలకు భారీ గండి పడింది. చివరకు అయోధ్య రామాలయం కొలువైన ఫైజాబాద్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి దిశగా సాగుతుంది. యూపీలోని మొత్తం 80స్థానాల్లో బీజేపీ 34స్థానాల్లో, ఎస్పీ 34స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఆరెఎల్డీ 2, ఏఎస్పీకేఆర్ 1స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే యూపీలో బీజేపీ 27స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజార్టీ మార్కు 272 సీట్లను కూడా అందుకోలేని దుస్థితిలో పడిపోయింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న యూపీతో పాటు మహారాష్ట్ర, బీహార్, హర్యానా రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది.
అయోధ్య ఫైజాబాద్లోనూ బీజేపీ వెనుకంజ
యూపీ దెబ్బకు బీజేపీ గిలగిల సొంతంగా మెజార్టీ మార్కు చేరుకోలేని దుస్థితి.బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వెనుకబడటంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న 400సీట్ల అంచనాలకు భారీ గండి పడింది.

Latest News
వనదేవతల జాతర మేడారంలో అభివృద్ధి తోరణం
వరంగల్ కాంగ్రెస్ ‘తూర్పులో మార్పు’ రాజకీయం!
భారత్తో కలిసి ట్రంప్ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!
‘మెస్సీ vs మేస్త్రీ’ ఫుట్బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు: దాసోజు ఫైర్
వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!
ఇకపై సినిమా టికెట్ ధరలు పెంచేదే లేదు: మంత్రి కోమటిరెడ్డి
సర్పంచ్ రామచంద్రారెడ్డికి కేసీఆర్ అభినందనలు
విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్
జన గణనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
బాక్సాఫీస్పై ‘అఖండ 2’ తుపాను…