విధాత : బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వెనుకబడటంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న 400సీట్ల అంచనాలకు భారీ గండి పడింది. చివరకు అయోధ్య రామాలయం కొలువైన ఫైజాబాద్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి దిశగా సాగుతుంది. యూపీలోని మొత్తం 80స్థానాల్లో బీజేపీ 34స్థానాల్లో, ఎస్పీ 34స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఆరెఎల్డీ 2, ఏఎస్పీకేఆర్ 1స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. గత పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే యూపీలో బీజేపీ 27స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ సొంతంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజార్టీ మార్కు 272 సీట్లను కూడా అందుకోలేని దుస్థితిలో పడిపోయింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న యూపీతో పాటు మహారాష్ట్ర, బీహార్, హర్యానా రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి ఆశించిన స్థానాలు దక్కకపోవడంతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది.
అయోధ్య ఫైజాబాద్లోనూ బీజేపీ వెనుకంజ
యూపీ దెబ్బకు బీజేపీ గిలగిల సొంతంగా మెజార్టీ మార్కు చేరుకోలేని దుస్థితి.బీజేపీకి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ వెనుకబడటంతో ఆ పార్టీ ఆశలు పెట్టుకున్న 400సీట్ల అంచనాలకు భారీ గండి పడింది.

Latest News
స్ట్రీట్ కాజ్ ఎన్జీఓకు కేటీఆర్ ₹17 లక్షల విరాళం.. యువతతో మమేకం
రూ.59,999కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. జెలియో నుంచి 2026 గ్రేసీ లాంచ్!
అనవసరపు కొనుగోళ్లు వద్దు.. రాష్ట్రంలో సమృద్ధిగా పెట్రోల్, డీజిల్ నిల్వలు
10,200mAh భారీ బ్యాటరీతో వివో స్మార్ట్ఫోన్.. చైనాలో లాంచ్, ధర ఎంతంటే..!
వెట్-బల్బ్ హీట్ జోన్లో హైదరాబాద్.. ఇది అత్యంత ప్రమాదకర వాతావరణ పరిస్థితి
సీఎం ప్రజావాణిలో దూరవిద్య బాధిత విద్యార్థులు.. న్యాయం చేసేందుకు చిన్నారెడ్డి భరోసా
ఒకే స్కూటర్పై ఆరుగురు చిన్నారులు.. బెంగళూరులో తీసిన ఫొటో వైరల్!
విదేశాలకు వెళ్లిన భారతీయులు అందుకే తిరిగి రావాలనుకోరు.. సూటిగా అసలు కారణం చెప్పేసిన ఎన్ఆర్ఐ మహిళ!
ఈ గుడికి వెళ్లొస్తే బట్టతల మీద కూడా జుట్టు వస్తుందట.. జపాన్లో వైరల్గా మారిన మికామి ఆలయం
వరంగల్ కేంద్రంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట