T20 WC 2024 Prize Money| టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా దుమ్ము రేపింది. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా కప్ కొట్టి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో ఇండియా మొత్తం సంబరాలు అంబరాన్నంటాయి. 2007లో చివరిగా టీ20 వరల్డ్ కప్ దక్కించుకున్న టీమిండియా మళ్లీ 17 ఏళ్లకు టీ20 ప్రపంచకప్ని
T20 WC 2024 Prize Money| టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా దుమ్ము రేపింది. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా కప్ కొట్టి చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో ఇండియా మొత్తం సంబరాలు అంబరాన్నంటాయి. 2007లో చివరిగా టీ20 వరల్డ్ కప్ దక్కించుకున్న టీమిండియా మళ్లీ 17 ఏళ్లకు టీ20 ప్రపంచకప్ని ముద్దాడింది. ఈ విజయంతో రోహిత్ బృందానికి ప్రైజ్మనీ కోట్లలోనే అందిస్తుంది ఐసీసీ. మంచి విజయాన్ని అందుకున్న టీమిండియాకి ట్రోఫీతో పాటు 2.45 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 20.42 కోట్ల బహుమతి ఐసీసీ నుండి అందనుంది. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ విన్నర్గా నిలిచిన ఇండియాకు 9.84 కోట్ల ప్రైజ్ మనీ దక్కగా…2024లో డబుల్ ప్రైజ్మనీ అందుకోవడం గమనార్హం. ఇక ఇదే కాకుండా భారత జట్టు సాధించిన ప్రతి విజయానికి గాను విడిగా రూ.26 లక్షలు దక్కనుంది. అంటే మొత్తం ఈ టోర్నీ ద్వారా భారత జట్టు రూ.22.76 కోట్లు రాబట్టింది.
2024 టీ20 వరల్డ్ కప్లో రన్నరప్గా నిలిచిన సౌతాఫ్రికా 10.67 కోట్ల ప్రైజ్మనీ అందుకోనుంది.ఇది కాకుండా, 8 మ్యాచ్లు గెలిచినందుకు విడిగా సుమారు 2.07 కోట్ల రూపాయలు వారికి అందించనున్నారు. అంటే ఈ టోర్నీ ద్వారా దక్షిణాఫ్రికా మొత్తం రూ.12.7 కోట్లు ఆర్జించింది. ఇక సెమీ ఫైనల్లో ఓడిన జట్లకు ఐసీసీ రూ.6.56 కోట్ల ప్రైజ్ మనీని అందించనుంది. అంటే ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్లో ఓడగా వారికి రూ.6.56 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తారు. అవే కాకుండా ఒక్కో మ్యాచ్ విజయానికి ప్రత్యేకంగా రూ.26 లక్షలు అందజేస్తారు. ఇక సూపర్-8 రౌండ్ నుంచి నిష్క్రమించిన ఒక్కో జట్టుకు 3.18 కోట్లు అందించనున్నారు. అంటే వెస్టిండీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, USA జట్లకి 3.18 కోట్లు లభిస్తాయి. వే కాకుండా ఈ జట్లకు ఒక్కో విజయానికి విడివిడిగా రూ.26 లక్షలు లభిస్తాయి.
గ్రూప్ స్టేజి దాటిన జట్టుకి కూడా ఐసీసీ ప్రైజ్ మనీ ఇస్తుంది. అంటే 9 నుంచి 12వ ర్యాంక్లో ఉన్న జట్లకు ఐసీసీ ఒక్కో మ్యాచ్ విజయంపై రూ.2.06 కోట్లు అందించనుంది. అలాగే 13 నుంచి 20వ ర్యాంకు జట్లకు దాదాపు రూ.1.87 కోట్లు ఇవ్వనుంది. టీ20 వరల్డ్ కప్లో అద్భుతమైన బౌలింగ్తో అదరగొట్టిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డు దక్కగా, ఆ అవార్డుకుగాను బుమ్రాకు పన్నెండు లక్షల ముప్పై వేల ప్రైజ్మనీ దక్కింది. ఇక ఫైనల్లో అద్భుతమైన అర్ధ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న కోహ్లీకి నాలుగు లక్షల పదివేల ప్రైజ్మనీ అందింది. చివరి ఓవర్లో అద్భుత క్యాచ్తో మెరిసిన సూర్యకుమార్ యాదవ్ స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డుకు గాను అతడికి రెండు లక్షల పదివేల ప్రైజ్మనీ అందింది.