192 కిలోల గంజాయి స్వాధీనం … ముగ్గురు అంతర్‌ రాష్ట్ర గంజాయి .. స్మగ్లర్ల ముఠా అరెస్టు

భారీ స్థాయిలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్‌, దామెర పోలీసులు సంయుక్తంగా కల్సి శనివారం అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు 50 లక్షల విలువ గల 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Publish Date - June 8, 2024 / 04:43 PM IST

ముగ్గురు అంతర్‌ రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠా అరెస్టు

– 192 కిలోల గంజాయి స్వాధీనం

విధాత, వరంగల్ ప్రతినిధి:భారీ స్థాయిలో స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్‌, దామెర పోలీసులు సంయుక్తంగా కల్సి శనివారం అరెస్టు చేసారు. వీరి నుండి సుమారు 50 లక్షల విలువ గల 192 కిలోల గంజాయితో పాటు ఒక కారు మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1.గజ్జి సహదేవ్‌ (29), గోరికొత్తపల్లి, భూపాల్‌పల్లి జిల్లా. ప్రస్తుతం పెగడపల్లి డబ్బాలు వద్ద నివాసం వుంటున్నాడు. 2. జై యోగేశ్వర్‌ (27), సోమన్మెర్, ఆహ్మద్‌నగర్‌, షిరిడీ, మహారాష్ట్ర, 3.సోమనదత్‌ రాందాస్‌ కాలాటి (24), కలాట్ వాడి, బీడ్ జిల్లా మహారాష్ట్ర కు చెందినవారు కాగా ప్రస్తుతం మరో ముగ్గురు నిందితులు 1)పాండు, నివాసం కూరమనూర్‌, ఒరిస్సా 2)లక్ష్మీ తాటే, 3) వికాస్‌ తాటే నివాసం పంచవటి, మహారాష్ట్ర ప్రస్తుతం పరారీలో వున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వివరాలను వెల్లడిస్తూ నిందితుడు గజ్జి సహదేవ్‌ కారుడ్రైవర్‌ గా జీవనం కోనసాగిస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరు మండలం, తునగొండ గ్రామ పరిసరాల నుండి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఇదే తరహాలో గజ్జి సహాదేవ్‌ తో సహా మిగిలిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Latest News