బతికే ఉన్నాడా? ఐదు గంటలుగా చెరువులోనే..

హనుమకొండలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే హనుమకొండ పట్టణంలోని రెడ్డి పురం కోవెలకుంటలో ఓ వ్యక్తి మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా

  • Publish Date - June 10, 2024 / 05:37 PM IST

హన్మకొండలో ఆసక్తికర సంఘటన
ఖంగుతిన్న పోలీసులు, స్థానికులు

విధాత, వరంగల్ ప్రతినిధి: హనుమకొండలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే హనుమకొండ పట్టణంలోని రెడ్డి పురం కోవెలకుంటలో ఓ వ్యక్తి మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉండగా అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు‌, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, పోలీసులు స్థానికుల సహాయంతో ఆ వ్యక్తి మృతి చెంది ఉన్నాడనే కోణంతో ఒకరి చేతి మరొకరు పట్టుకొని బయటికి తీసే క్రమంలో అతను బతికి ఉండడం గమనార్హం.

కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ వ్యక్తి చెరువులోకి దిగి పడుకోవడంతో అది గమనించిన స్థానికులు అతను చనిపోయాడని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో చనిపోయాడని భావించి ఆ వ్యక్తినిబయటికి తీస్తున్న క్రమంలో తాను ఒక్కసారిగా కదిలి లేవడంతో పోలీసులు ఖంగుతిన్నారు. పోలీసుల, 108 సిబ్బంది అలాగే స్థానికుల సమయం వృధా చేయడంతో కేయూ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.

Latest News