బావ బామ్మర్థులు కేటీఆర్, హరీశ్రావుల మధ్య బీఆరెస్లో జరుగుతున్న ఆధిపత్య గోవడల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వారిద్ధరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు
విధాత, హైదరాబాద్ : బావ బామ్మర్థులు కేటీఆర్, హరీశ్రావుల మధ్య బీఆరెస్లో జరుగుతున్న ఆధిపత్య గోవడల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వారిద్ధరూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. సోమవారం గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆరెస్ నాయకుల పాలనలో ఎప్పుడు విద్యార్ధి, నిరుద్యోగులకు పాలకులు అందుబాటులో లేరన్నారు. మీ పాలనలో ప్రజా సమస్యలపై మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టిన సంగతి మరువరాదని కేటీఆర్, హరీశ్లకు గుర్తు చేశారు. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జీవో 55 రద్దు చేశామని, 11,000 డిఎస్సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, 30వేల పైచిలుకు ఉద్యోగాలిచ్చామన్నారు. టీజీపీఎస్సీ ద్వారా వైద్య, సంక్షేమ శాఖల్లో ఉద్యోగ భర్తీ చర్యలు ప్రారంభమయ్యాయన్నారు. జీవోo నెంబర్ 3 తీసుకు వచ్చి హారిజాంటల్ ఇష్యూ ను పరిష్కారం చేశామని తెలిపారు. మీ పాలనలో ఒక్క రోజు మూడు ఉద్యోగ పరీక్షలు ఉన్నాయంటే ఎవరు పట్టించుకోలేదని, మేం పరీక్షల నిర్వాహణ మధ్య గ్యాప్ పాటిస్తున్నామని చెప్పారు. పదేండ్లలో మీరు సృష్టించిన సమస్యలు పరిష్కారం చేస్తూ విద్యార్థులకు న్యాయం చేస్తున్నామని వెంకట్ పేర్కోన్నారు. పదేండ్ల మీ పాలన.. ఆరు నెలల మా పాలన పై బహిరంగ చర్చకు మేము సిద్ధమన్నారు.
హరీశ్రావు స్కామ్లు బయటికొస్తాయి
బీఆరెస్ పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగినట్లుగానే సీఎంఆర్ఎఫ్ చెక్కులలోనూ అవినీతి జరిగిందని, హరీష్ రావు పేషిలో పని చేసిన ఒక వ్యక్తి స్కాంలో అరెస్ట్ అయ్యారన్నారు. సీఎంఆర్ఎఫ్లో జరిగిన అవినీతినీ కూడా బయటికి తీస్తామని, ఒక వ్యక్తికి సంబంధించి వేర్వేరు అకౌంట్ల పేరుతో చెక్కులు సృష్టించారని, వాస్తవానికి ఉన్నతి 30వేల చెక్కులేనని, ఇప్పటికే ఆ డిపార్ట్మెంట్లో కొందరిని అరెస్టు చేశారని వెల్లడించారు. హరీశ్రావు చేసిన స్కామ్ లు కూడా బయటికి వస్తాయని, ఇప్పటికే ప్రజా ప్రభుత్వం లో జూన్ 15వ తేదీ వరకు 75 వేల చెక్కులులు రెడీ అయ్యాయని, 15 వేల చెక్కులు లబ్ధిదారులకు అందచేయడం జరిగిందని, ఆరోగ్య శ్రీ 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచామని తెలిపారు.
మీలాగా మేం గొంతులు నొక్కడం లేదు
సమస్య ఉన్న చెప్పుకోవడానికి మేము అవకాశం ఇస్తున్నామని, మీ లాగా మేము గొంతులు నొక్కడం లేదని, మీ లాగా కోదండరాం, హరగోపాల్ గొంతులు నొక్కడం లేదని, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటున్నామని చెప్పారు. మీ ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు పడ్డాయో అందరికీ తెలుసు..మా పాలనలో ఒకటవ తేది జీతం వేస్తున్నామన్నారు. జాబ్ క్యాలెండర్ హామీని నెరవేర్చుతామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎప్పటికప్పుడు ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆరెస్ వాళ్ళు స్కూల్ బంద్ చేస్తే…మేము పేద ప్రజల కోసం స్కూల్ లు తెరిపిస్తున్నామన్నారు. పేపర్ లీకేజి నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ఇక్కడ పేపర్ లీకేజి చూసి అక్కడ పెద్దలు నీట్ పేపర్ లీకేజి చేశారని విమర్శించారు. మాజీ మంత్రిగా బాధ్యత మరిచి హరీశ్రావు తప్పుడు స్టేట్ మెంట్లు, తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను, నిరుద్యోగులను తప్పు దోవ పట్టించ కూడదని, సమస్యలు ఉంటే నాతో చెప్పండని, సీఎం దగ్గరికి నేను తీసుకువెళతానని, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.