విధాత:భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంతో పాటుగా పైనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు నీటిమట్టం 53.2 అడుగులకు చేరుకుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు గోదావరి నీటిమట్టం 52.4 అడుగుల వద్ద ప్రవహించిన వరదనీరు క్రమంగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.2 అడుగులకు చేరడంతో అధికారులు చివరి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పట్టణంలోని ఏఎంసీ కాలనీలోని మురుగునీరు గోదావరిలో కలవడానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కాలనీలోకి మురుగు నీరు చేరడంతో సుమారు 80 కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
Bhadrachalam | భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం,మూడో ప్రమాద హెచ్చరిక జారీ … పలు కాలనీల్లో చేరిన వరద నీరు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. రాష్ట్రంతో పాటుగా పైనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Latest News
ప్రాధాన్యత వారిగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు : మంత్రి ఎన్.ఉత్తమ్ వెల్లడి
దళపతి విజయ్ విడాకుల మేటర్..
రైతు భరోసా ఎప్పుడూ..? : కేటీఆర్ నిలదీత
చైర్మన్ పై మతపర వ్యాఖ్యలు..ఏపీ శాసన మండలిలో రచ్చ!
కర్ణాటక సీఎం సిద్దరామయ్యపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు!
రాజ్యసభ ఎన్నికల వేడి..అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
వెయ్యేళ్ల శిల్పం కిరీటం...కాకతీయ కళా వైభవానికి కొత్త దర్పణం!
లిఫ్ట్ యాక్సిడెంట్.. వామ్మో తృటిలో చావు తప్పింది.. !
మార్చ్ 19 నుంచి జూన్ 2కి వాయిదా పడ్డ ‘టాక్సిక్’..
దిగొచ్చిన బంగారం, వెండి ధరలు