గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
విధాత, హైదరాబాద్ : గుంటూరు(నడికుడి)-సికింద్రాబాద్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ రైలు మిర్యాలగూడలో నిలిపివేశారు. అలాగే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు పిడుగురాళ్లలో నిలిపివేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడానికి కారణాలు తెలియరాలేదు. రైళ్ల రాకపోకలు పునరుద్ధరించేందుకు తక్షణ చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.