TUWJ IJU| శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి

ఈనెల 23,24వ తేదీల్లో హైదరాబాద్ లోని నాంపల్లి మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరగనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని టీయు డబ్ల్యూజె (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు.

TUWJ IJU| శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి

* 17వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి
* 23, 24 తేదీల్లో హైదరాబాదులో శిక్షణ

విధాత: ఈనెల 23,24వ తేదీల్లో హైదరాబాద్ లోని నాంపల్లి మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరగనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులను ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని టీయు డబ్ల్యూజె (ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు. శిక్షణ తరగతులను దృష్టిలో ఉంచుకొని బుధవారం జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన అనంతరం చిట్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మీడియా అకాడమీ,టీయూడబ్ల్యూజే(ఐజేయు ) ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు సంబంధించి ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఈనెల 17వ తేదీలోగా టీ యు డబ్ల్యూ జె జిల్లా కమిటీకి తమ పేర్లను అందజేయాలని తెలిపారు.

జర్నలిజంలో వృత్తిపర నైపుణ్యం మెరుగుపరిచే లక్ష్యంతో అందజేస్తున్న ఈ శిక్షణ జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని గార్లపాటి పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, వృత్తిపరంగా మెలకువలు నేర్పించడం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటుచేసిన మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ తో పాటు ఇంటి స్థలం, ఇల్లు, హెల్త్ కార్డులు అందించడం కోసం టియుడబ్ల్యూజే జిల్లా కమిటీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు ఎలక్ట్రాన్ మీడియా జిల్లా అధ్యక్షులు దోటి శ్రీనివాస్TUWJ IJU జిల్లా నాయకులు పులిమామిడి మహేందర్ రెడ్డి, చిట్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యే ళ్ల బయన్న, మెండె వెంకన్న, పోకల కరుణాకర్, చెరుపల్లి శ్రీనివాస్, మిరియాల ప్రకాష్, అమ రోజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.