విధాత: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. నాగార్జున సాగర్ డ్యాంకు కూడా ఎగువ శ్రీశైలం నుంచి వరద భారీగా వస్తుండటంతో సాగర్ నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగ ప్రస్తుత నీటి మట్టం 582.2 అడుగులకు చేరుకుంది. 1,01,800 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా ఔట్ఫ్లో 10,294 క్యూ సెక్కుల నీటిని ఎడమ కాలువ ద్వారా 6,844 క్యూ సెక్కుల నీటిని కుడి కాలువ ద్వారా అధికారులు వదులుతున్నారు. అయితే ఖమ్మంలోని పాలేరు జలాశయాన్ని నింపడం కోసం ఎడమ కాలువ ద్వారా విడుదల చేసే నీటిని 1000 క్యూ సెక్కుల నుంచి 3000 క్యూసెక్కులు పెంచుతూ విడుదల చేస్తున్నారు. ఎగువ శ్రీశైలం నుంచి వరద భారీగా వస్తుండటంతో నేడో రేపో అధికారులు సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Nagarjuna Sagar| నిండు కుండలా నాగార్జున సాగర్
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు దంచి కొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. నాగార్జున సాగర్ డ్యాంకు కూడా ఎగువ శ్రీశైలం నుంచి వరద భారీగా వస్తుండటంతో సాగర్ నిండు కుండలా మారింది.

Latest News
ఒక్కటైన 'గీత–గోవిందం' : ఘనంగా జరిగిన విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా భార్య, ఎస్పీ గా భర్త !
వెస్టిండీస్పై సౌతాఫ్రికా సూపర్ ‘హిట్’ : ఊపిరి పీల్చుకున్న భారత్
తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
ప్రతిభ కబనబరిచిన పోలీసు జాగిలం భైరవ్ కి గోల్డ్ మెడల్
రూ.200 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
ఓ వ్యక్తిని తొండంతో విసిరిపడేసిన గజరాజు
స్పేస్ మస్తుంది...మావోయిస్టులదే నిర్ణయం!
చివరి నిమిషంలో లీవ్ క్యాన్సెల్ చేసిన బాస్.. ఐ డోంట్ కేర్ అంటూ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన ఉద్యోగి
ఫ్రూట్స్ను కడగకుండా తింటున్నారా..? జాగ్రత్త వాటికి ఎలుకల మందు పూస్తున్నారు