ఆరు వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం
విధాత, హైదరాబాద్: విసాక ఇండస్ట్రీస్కు రూ.17.5 కోట్లను ఆరు వారాల్లోపు చెల్లించాలని హెచ్సీఏకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విసాక ఇండస్ట్రీస్ బ్యాంక్లో లోన్ తెచ్చి స్పాన్సర్ షిప్ చేసుకుంది. ఆ తరువాత హెచ్సీఏ – విసాక ఇండస్ట్రీస్ మధ్య స్పాన్సర్ షిప్ అగ్రిమెంట్ను హెచ్సీఏ క్యాన్సల్ చేసింది.
అగ్రిమెంట్ క్యాన్సెల్ చేసినందుకు విసాక ఇండస్ట్రీస్కు 18 శాతం ఇంటరెస్ట్తో రూ.25 కోట్లు చెల్లించాలని 2016లోనే కోర్టు ఆదేశించినా ఇప్పటివరకు ఎటువంటి చెల్లింపులు చేయకుండా బాంక్ అకౌంట్స్ డీ ఫ్రీజ్ చేయాలని తెలంగాణ హైకోర్టులో హెచ్సీఏ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది.
ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విసాక ఇండస్ట్రీస్ స్పాన్సర్ షిప్ చేసిందని.. స్పాన్సర్ షిప్ రైట్స్ ఇవ్వకుండా అగ్రిమెంట్ను హెచ్సీఏ క్యాన్సిల్ చేసిందని విసాక ఇండస్ట్రీస్ తరుఫు న్యాయవాది న్యాయస్థానానికి గుర్తుచేశారు. విశాక ఇండస్ట్రీస్తో ఉన్న అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసినందుకు రూ.25 కోట్లు చెల్లించాలని 2016లో కమర్షియల్ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.
ఆ డబ్బులు చెల్లించకుండా హెచ్సీఏ హైకోర్టుకు వచ్చారన్నారు. విసాక ఇండస్ట్రీస్కు చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో హెచ్సీఏ ప్రాపర్టీస్ను, బ్యాంక్ అకౌంట్స్ను 2022 అక్టోబర్లో కమర్షియల్ కోర్టు అటాచ్ చేసిందని తెలిపారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ఆరు వారాల్లోగా రూ.17.5 కోట్లు విసాక ఇండస్ట్రీస్కు చెల్లించాలని హెచ్సీఏకు ఆదేశాలు జారీ చేసింది.