విధాత, వరంగల్ ప్రతినిధి:తన భూ సమస్య పరిష్కారం పట్ల చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జనగామ కలెక్టరేట్లో సోమవారం ఓ మహిళా ఆత్మహత్యకు యత్నిచిన సంఘటన జరిగింది.ఇటీవలే భూ వివాదం నేపథ్యంలో ఓ రైతు పురుగుల మందు తాగి కలెక్టరేట్ భవనం ఎక్కి సూసైడ్ అట్మెo ట్ చేశాడు. ఆ సంఘటన మరవక ముందే తాజాగా జనగామ జిల్లా నర్మెట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతి తన వ్యవసాయభూ సమస్య విషయమై కలెక్టరేట్ కు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగించింది. భూ వివాదంతో జ్యోతి గత కొద్ది రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా, పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది సోమవారం కలెక్టరేట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే అప్పటికే ఇంటివద్ద నిద్ర మాత్రలు మింగి ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి జ్యోతి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జ్యోతిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జనగామ కలెక్టరేట్లో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం .. ఈ మధ్యలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నం
తన భూ సమస్య పరిష్కారం పట్ల చేస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జనగామ కలెక్టరేట్లో సోమవారం ఓ మహిళా ఆత్మహత్యకు యత్నిచిన సంఘటన జరిగింది.

Latest News
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్లో డాక్టర్ గురవా రెడ్డి పోస్ట్ వైరల్..
మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై సరికొత్త చర్చ..
నాలుగు రోజుల్లో అమెరికా కోల్పోయిన మిలిటరీ ఎక్విప్మెంట్ విలువ తెలుసా!
వృషకర్మ’ గ్లింప్స్ ఈవెంట్లో ప్రమాదం..
విజయ్-త్రిష ఒకే కారులో..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 36 గంటల పాటు నీటి సరఫరా బంద్
రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..!
తెలంగాణ నూతన గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
శుక్రవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్లో ‘రయ్ రయ్ రా రా’.. చెర్రీ డాన్స్కు ఇండియా ఫిదా