Yadadri Bhuvanagiri | రైతు సమస్యలపై కాంగ్రెస్ రణం..! యాదాద్రి కలెక్టరేట్ ముట్టడి!!

Yadadri Bhuvanagiri విధాత: ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్ మార్గాన్ని దిగ్బంధం చేసి ఆ మార్గంలో రాకపోకలు అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులు హోరెత్తించారు. కలెక్టరేట్ లోనికి చొచ్చుక వెళ్ళేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకొని నిలువరించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట సాగింది. అనంతరం కాంగ్రెస్ ప్రతినిధుల బృందం డిసిసి అధ్యక్షుడు […]

  • Publish Date - May 24, 2023 / 10:02 AM IST

Yadadri Bhuvanagiri

విధాత: ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్ మార్గాన్ని దిగ్బంధం చేసి ఆ మార్గంలో రాకపోకలు అడ్డుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులు హోరెత్తించారు. కలెక్టరేట్ లోనికి చొచ్చుక వెళ్ళేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకొని నిలువరించారు.

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట సాగింది. అనంతరం కాంగ్రెస్ ప్రతినిధుల బృందం డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ ల ఆధ్వర్యంలో కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదన్నారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని సకాలంలో ఎగుమతి చేయడం లేదని విమర్శించారు. తేమ, తరుగు పేరుతో అడ్డగోలుగా కోతలు పెడుతూ రైతులను శ్రమదోపిడి చేస్తున్నారన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్రజాప్యంతో , అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి, తరుగు కోతలు లేకుండా ఎగుమతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆలేరు, భువనగిరి, పోచంపల్లి, వలిగొండ, యాదగిరిగుట్ట, బీబీనగర్, తుర్కపల్లి, తదితర మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News