23న తెలంగాణ‌ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..?

తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సిద్ధ‌మైంది. ఈ నెల 23వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.

  • Publish Date - April 18, 2024 / 07:24 AM IST

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసేందుకు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సిద్ధ‌మైంది. ఈ నెల 23వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదురైతే 24వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నెల 25న జేఈఈ మెయిన్ ర్యాంకులు విడుద‌ల కానున్నందున ఈ నె 23 లేదా 24న ఫ‌లితాలు వెల్ల‌డించాల‌ని ఇంట‌ర్ బోర్డు అధికారులు నిర్ణ‌యించారు.

ఇప్ప‌టికే మూల్యాంక‌నం పూర్తి కాగా, న‌మోదైన మార్కుల ప‌రిశీల‌న జ‌రుగుతోంది. ఈ ప్ర‌క్రియ చాలా వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. మార్చి 10వ తేదీన మూల్యాంక‌న ప్రారంభం కాగా, మొత్తం నాలుగు విడుత‌ల్లో పూర్తి చేశారు. ఫ‌లితాల విడుద‌లలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఒక‌టికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు.

Latest News