చిన్నమ్మకు షాక్‌.. రూ.100కోట్ల విలువైన ఆస్తులు జప్తు!

విధాత:అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కు ఆదాయపు పన్ను విభాగం అధికారులు గట్టి షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఆస్తులను 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్న సమయంలో చిన్నమ్మ కొనుగోలు చేశారు. అప్పుడు వీటి విలువ […]

  • Publish Date - September 8, 2021 / 02:07 PM IST

విధాత:అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కు ఆదాయపు పన్ను విభాగం అధికారులు గట్టి షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

ఈ ఆస్తులను 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్న సమయంలో చిన్నమ్మ కొనుగోలు చేశారు. అప్పుడు వీటి విలువ దాదాపు రూ. 20లక్షలు కాగా.. ఇప్పుడు రూ.100కోట్ల వరకు ఉంటుందని అంచనా. 2014లో కర్ణాటక ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో ఈ 11 ఆస్తులను ‘‘ఆదాయానికి మించి ఆస్తులు’గా పేర్కొన్నారు. ఈ తీర్పు ఆధారంగానే ఐటీశాఖ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అవినీతి కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవించి ఈ ఏడాది ఆరంభంలో విడుదలయ్యారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి అయిన శశికళ.. ఆమె మరణానంతరం అన్నాడీంకే బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే అవినీతి కేసులో శిక్ష పడటంతో జైలుకెళ్లాల్సి వచ్చింది. అనంతరం జరిగిన పరిణామాల్లో శశికళను పార్టీ నుంచి బహిష్కరిస్తూ అన్నాడీఎంకే నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు శశికళ తిరిగి అన్నాడీఎంకేలో చేరతారనే వార్తలు వినిపించినప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు.

Latest News