వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పీటేషన్ పైహైకోర్టులో విచారణ విధాత:ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన హైకోర్టు.మత పరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు లేదని స్పష్టం చేసిన హైకోర్టు.కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించ కుండా పూజలు చేసుకోవాలని సూచించిన కోర్టు.పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన హైకోర్టు.ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్ధించిన హైకోర్టు. ప్రైవేటు స్థలాల వరకు విగ్రహాలు ఏర్పాటు […]
వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పీటేషన్ పై
హైకోర్టులో విచారణ
విధాత:ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసిన హైకోర్టు.మత పరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు లేదని స్పష్టం చేసిన హైకోర్టు.కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించ కుండా పూజలు చేసుకోవాలని సూచించిన కోర్టు.పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన హైకోర్టు.ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్ధించిన హైకోర్టు.
ప్రైవేటు స్థలాల వరకు విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ఆదేశాలు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని స్పష్టం చేసిన హైకోర్టు.