విధాత,ఆటోలు,వాహనాలతో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు, దౌర్జన్యంగా అరెస్టు చేసిన పోలీసులు బిజెపి ,కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజాగ్రహం.నిరసనలతో స్తంభించిన అలంకార్ జంక్షన్ .ధర్నాలో పాల్గొని అరెస్టయిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు తదితర వామపక్ష నేతలు సిపిఎం, సిపిఐ ఎం సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ప్రజా నిరసన ఈ కార్యక్రమంలో పాల్గొని అరెస్టు అయిన సీపీఎం నేతలు సిహెచ్ బాబూరావు, డివి కృష్ణ, డీ కాశీనాథ్ సిపిఐ నేతలు డి శంకర్, […]
విధాత,ఆటోలు,వాహనాలతో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు, దౌర్జన్యంగా అరెస్టు చేసిన పోలీసులు బిజెపి ,కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రజాగ్రహం.నిరసనలతో స్తంభించిన అలంకార్ జంక్షన్ .ధర్నాలో పాల్గొని అరెస్టయిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు తదితర వామపక్ష నేతలు సిపిఎం, సిపిఐ ఎం సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ప్రజా నిరసన
ఈ కార్యక్రమంలో పాల్గొని అరెస్టు అయిన సీపీఎం నేతలు సిహెచ్ బాబూరావు, డివి కృష్ణ, డీ కాశీనాథ్ సిపిఐ నేతలు డి శంకర్, రమణ బాబు, న్యూ డెమోక్రసీ నేత పోలారి, ఎంసిపిఐ నేత ఖాదర్ భాషా తదితరులు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ….
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు.ఒక సంవత్సరం లోనే పెట్రోల్, డీజిల్ పై మూడున్నర లక్షల కోట్ల రూపాయలు దండుకుని ఖజానా నింపుకున్న మోడీ సర్కార్.కరోనా కష్టకాలంలో కనికరం లేకుండా ఆరు నెలల్లో 63 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన బిజెపి ప్రభుత్వం.పాకిస్తాన్లో లీటర్ పెట్రోలు 50 రూపాయలు కాగా భారతదేశంలో 108 రూపాయలు అమ్మడం దుర్మార్గం.ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు కూడా ధరలు తగ్గించకుండా పన్నులు పెంచిన మోడీ ప్రభుత్వం.40 రూపాయల పెట్రోల్ పై 65 రూపాయలు పన్నులు విధించడం ప్రపంచంలో ఎక్కడా లేదు.రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పన్ను తగ్గించాలి.కేంద్ర ప్రభుత్వ ధరల పెంపుపై మౌనం వహిస్తున్న వైసిపి, టిడిపిలు, గళం విప్పాలి.దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పెట్రోల్ ధరలు పెంపుపై ఉద్యమం కొనసాగిస్తాం. సాధారణ ప్రజలు భాగస్వాములు కావాలి.ప్రజా ఉద్యమాన్ని అణిచి వేస్తున్న పోలీసుల తీరును తప్పుపట్టిన నేతలు.