వారిని బుజ్జ‌గించండి.. లోకేష్‌తో సుజ‌నా చౌద‌రి

టికెట్ల పంప‌కం విష‌యంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల‌ కూట‌మి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి

  • Publish Date - March 30, 2024 / 04:44 AM IST

టికెట్ల పంప‌కం విష‌యంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల‌ కూట‌మి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి

విధాత‌: టికెట్ల పంప‌కం విష‌యంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీల‌ కూట‌మి రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. టికెట్ ఆశించిన నేత‌లు పంప‌కాల్లో భాగంగా టికెట్ ల‌భించ‌క‌పోవ‌డంతో ప‌లువురు నేత‌లు అస‌మ్మ‌తితో ర‌గిలి పోతున్నారు. ఈ క్ర‌మంలో విజ‌య‌వాడ వెస్ట్ బీజేపీ అభ్య‌ర్థి సుజ‌నా చౌదరి టీడీపీ ముఖ్య‌నేత నారా లోకేష్‌ను హైద‌రాబాద్‌లో కలిశారు. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని పరిస్థితుల గురించి చ‌ర్చించుకున్నారు. ఈ మేర‌కు టీడీపీ నేత‌లైన బుద్ధా వెంక‌న్న, జ‌లీల్ ఖాన్‌, జ‌న‌సేన నేత పోతిన మ‌హేష్ అసంతృప్తిగా ఉన్న నేప‌థ్యంలో వారిని బుజ్జ‌గించాల‌ని సుజ‌నా చౌద‌రి యువ‌నేత లోకేష్‌ను కోరారు.

Latest News