విధాత: తాడేపల్లి పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడేపల్లి పీఎస్కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి పీఎస్ లోపలికి వెళ్లారు. పీఎస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ […]
విధాత: తాడేపల్లి పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడేపల్లి పీఎస్కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న, పట్టాభి పీఎస్ లోపలికి వెళ్లారు. పీఎస్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.