ఢిల్లీకి చేరిన ఉక్కు ఉద్యమం
విధాత: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో మొదలైన ఉద్యమం ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించేందుకు వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు హస్తినకు పయనమయ్యారు. అయోధ్యరామ్, ఆదినారాయణ, రాజశేఖర్ పలువురు కార్మిక నేతలతో కలిసి విశాఖ ఎంపీ సత్యనారాయణ, తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శ్రీధర్ తదితరులు విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఏపీ ఎక్స్ప్రెస్లో బయల్దేరిన […]

విధాత: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ నినాదంతో మొదలైన ఉద్యమం ఢిల్లీకి చేరింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించేందుకు వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు హస్తినకు పయనమయ్యారు. అయోధ్యరామ్, ఆదినారాయణ, రాజశేఖర్ పలువురు కార్మిక నేతలతో కలిసి విశాఖ ఎంపీ సత్యనారాయణ, తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ శ్రీధర్ తదితరులు విశాఖ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరారు.
ఏపీ ఎక్స్ప్రెస్లో బయల్దేరిన కార్మికులు
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉక్కు కార్మికుల నినాదాలతో దువ్వాడ రైల్వే స్టేషన్ దద్దరిల్లింది. వందలాది మంది ఉక్కు కార్మికులు ఏపీ ఎక్స్ప్రెస్లో శనివారం రాత్రి బయల్దేరారు. 32 మంది అమర వీరుల త్యాగఫలం విశాఖ ఉక్కు అని ఈ సందర్భంగా కార్మికులు స్పష్టం చేశారు. 64 గ్రామాల నిర్వాసితులు 26వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని నినదించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. తెలుగు ప్రజల ఉద్యమ స్ఫూర్తిని చాటి చెబుతామని స్పష్టం చేశారు.