దివంగత మా తండ్రి వైఎస్సార్ ఆకస్మిక మరణాంతర పరిణామాల్లో అన్నజగన్ కోసం పాదయాత్ర చేశానని, ఇప్పుడు కూడా న్యాయం కోసం పోరాడుతు కడప ఎంపీగా నిలబడ్డానని ఈ ఎన్నికల్లో మా వైపు న్యాయం గెలుస్తుందా?
నేడు న్యాయం కోసం పోరాటం
కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలి
విధాత : దివంగత మా తండ్రి వైఎస్సార్ ఆకస్మిక మరణాంతర పరిణామాల్లో అన్నజగన్ కోసం పాదయాత్ర చేశానని, ఇప్పుడు కూడా న్యాయం కోసం పోరాడుతు కడప ఎంపీగా నిలబడ్డానని ఈ ఎన్నికల్లో మా వైపు న్యాయం గెలుస్తుందా? అవినాశ్ రెడ్డి నేరం గెలుస్తుందా? అని ప్రపంచమంతా చూస్తోందని, కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి, పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల కోరారు. గురువారం పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు.
జగన్ పాలనలో హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని, బాబాయి వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నామని, కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్ వంటి ఆధారాలన్నీ ఉన్నాయని చెప్పారు. బాబాయిని చంపిన హంతకులనే సీఎం జగన్ కాపాడుతున్నారని, జగన్కు అధికారమిచ్చింది ఆయన్ను కాపాడటానికేనా? అని ప్రశ్నించారు. ఎంపీగా అవినాశ్రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని షర్మిల విమర్శించారు.
రేపోమాపో అవినాష్ రెడ్డి జైలుకు: సునీత
తన తండ్రి వైఎస్. వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చిన ఘటనలో న్యాయం కోసం పోరాడుతున్నామని వైఎస్ సునిత చెప్పారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావొచ్చని, ప్రజా తీర్పు చాల పెద్దదని.. దానికోసమే షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. వైఎస్ అవినాశ్రెడ్డి రేపో మాపో జైలుకు పోతారని, జైలుకు పోయేవారు కాదు.. జనాల్లో ఉండేవాళ్లు ఎంపీగా రావాలని, అందుకే షర్మిలను గెలిపించి వివేకా ఆత్మకు శాంతి కలిగించండని సునీత ప్రజలను అభ్యర్థించారు.