వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ వర్దంతి కార్యక్రమం

విధాత: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత నేత డా వైయస్ రాజశేఖరరెడ్డి 12వ వర్దంతి కార్యక్రమం లో పాల్గొన్న‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రులు డా సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్ నేత డా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్ […]

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ వర్దంతి కార్యక్రమం

విధాత: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దివంగత నేత డా వైయస్ రాజశేఖరరెడ్డి 12వ వర్దంతి కార్యక్రమం లో పాల్గొన్న‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రులు డా సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్ నేత డా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్, తెలుగు అకాడెమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మలు వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

వైయస్సార్ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో పలువురు పార్టీ కార్యకర్తలు, వైయస్సార్ అభిమానులు రక్తదానం చేశారు. పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఒక మామూలు మనిషి నిబద్ధ‌తతో, పట్టుదలతో, మంచి ఆలోచనలతో మానవతావాదిగా పనిచేస్తే మహామనిషిగా ఎలా ఎదగవచ్చో నిరూపించినవ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చి తద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లేలా వైయస్ రాజశేఖరరెడ్డి పాలన సాగించారన్నారు. ఆయన అందించిన ప్రజారంజకపాలన అందరికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆయన తీసుకువచ్చిన పథ‌కాలు, మానవత్వంతో తీసుకున్న నిర్ణయాలు ఆయన పాలనకు వన్నె తెచ్చి ఆయన పాలనాకాలం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదిగా చరిత్రపుటల్లో నిలిచిపోయిందన్నారు. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు ఇలా ఏ ఏ వర్గాలకు ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుందో వాటిని ఆచరణలో అమలు చేసిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డికి దక్కుతుందన్నారు. వైయస్ జగన్ ఆ తండ్రికి తగ్గ తనయుడుగానే కాకుండా ఒక సంస్కర్తగా, అభ్యుదయవాదిగా, సామ్యవాదిగా నిలుస్తున్నారని తెలిపారు. గతంలో మనం మంచి పాలన అందిస్తే రామరాజ్యం అని చెప్పుకునే వాళ్లం…. ఆ తర్వాత వైయస్ సువర్ణయుగం రాజన్నరాజ్యంగా పేరు పొందింది. నేడు జగనన్నరాజ్యంగా మన ముందుకు తీసుకువచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రజారంజకపాలన అందిస్తున్నారన్నారు. ఈ పాలన ప్రజల జీవన విధానంలోనే మంచిమార్పు తీసుకువస్తోందన్నారు. ఆ మహానేత అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ముందుకు వెెళ్తున్నారన్నారు. వైయస్ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా వైయస్ జగన్ పాలన చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు అన్ని విధాలా అండదండలందిస్తూ ఆయనను బలోపేతం చేసేలా అందరూ పనిచేయాలని అన్నారు. ఇందుకోసం ప్రతిన పూనాలని వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను కోరారు.

కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి, నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, పలువురు పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.