సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్లకి కుర్చీ తాత పాషా పేరు బాగానే తెలిసి ఉంటుంది.. ఆ మధ్యలో ఆయన చెప్పిన ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ నెట్టింట తెగ వరైల్ అయింది. దీంతో పాషా ఒక సెలబ్రిటీగా మారారు.కుర్చీ తాత చెప్పిన డైలాగ్ తో ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం ఒక సాంగ్ రూపొందించడం, దానికి మహేష్, శ్రీలీల దుమ్మురేపేలా డ్యాన్స్ చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ‘కుర్చీ మడతపెట్టి..’ అనే ఓ డైలాగ్ తో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి.. తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు గుంటూరు కారం చిత్రయూనిట్. ఫుల్ మాస్ బీట్ తో ఈ పాట సాగగా, ఇందులో పాటకు మహేష్, శ్రీలీల అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశారు.ఇప్పుడు కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.
సాంగ్ విడుదలైన తర్వాత కుర్చీ తాత పాషా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా, అందులో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తను రెండ్రోజుల కింద వరంగల్ లోని తన బంధువుల ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. ‘గుంటూరు కారం’లో తన పాటను పెట్టడం హ్యాపీగా ఉందని చెప్పిన పాషా, ఆ పాటను తనే పాడానని కూడా చెప్పాడు. మరో సింగర్ కూడా గాత్రం అందించినట్టు తెలుస్తోంది. ఇక థమన్ తనకు రూ.లక్ష మాత్రం అందించినట్టు చెప్పిన పాషా… మహేశ్ బాబును కలిసే అవకాశం రాలేదన్నారు. ఒకసారి తను స్టూడియోకు వెళ్లే వరకే బాబు కారు వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు.
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు గారు నా కుర్చీ డైలాగ్ తో పాట చేసి, డ్యాన్స్ చేసినందుకు సంతోషంగా ఉంది. అంత గొప్ప నటుడు నా డైలాగ్ కి పాట చేసాడంటే ఆనందంగా అంది. ఇది దేవుడిచ్చిన అదృష్టం, మీ అభిమానం. నాకు అవకాశం వస్తే ఆ పాటకి కచ్చితంగా డ్యాన్స్ చేస్తాను అని అన్నారు. గుంటూరు కారం సినిమా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అవుతుండగా, ఆ రోజు ఈ మాస్ కుర్చీ పాటకు మాత్రం థియేటర్స్ దద్దరిల్లుతాయని, కుర్చీలు విరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.