Viral Video | మ‌ద్యం మ‌త్తులో టీచ‌ర్.. చెప్పుల‌తో దాడి చేసిన విద్యార్థులు

విద్యార్థుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణతో పాటు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. ప్ర‌తి రోజు మ‌ద్యం సేవించి పాఠ‌శాల‌కు రావ‌డం, త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థుల‌ను దూషించ‌డం ప‌నిగా పెట్టుకున్నాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు.. మ‌ద్యం తాగి స్కూల్‌కు వ‌చ్చిన ఉపాధ్యాయుడిని త‌గిన బుద్ధి చెప్పారు. చెప్పుల‌తో దాడి చేసి.. పారిపోయేలా చేశారు.

  • Publish Date - March 28, 2024 / 07:04 AM IST

Viral Video | రాయ్‌పూర్ : విద్యార్థుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణతో పాటు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయుడు వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. ప్ర‌తి రోజు మ‌ద్యం సేవించి పాఠ‌శాల‌కు రావ‌డం, త‌ర‌గ‌తి గ‌దిలో విద్యార్థుల‌ను దూషించ‌డం ప‌నిగా పెట్టుకున్నాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థులు.. మ‌ద్యం తాగి స్కూల్‌కు వ‌చ్చిన ఉపాధ్యాయుడిని త‌గిన బుద్ధి చెప్పారు. చెప్పుల‌తో దాడి చేసి.. పారిపోయేలా చేశారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బ‌స్త‌ర్ జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బ‌స్త‌ర్ జిల్లాలోని ప‌ల్లిభ‌ట గ్రామంలోని ప్రైమ‌రీ స్కూల్ టీచ‌ర్ మ‌ద్యం సేవించి పాఠ‌శాల‌కు వ‌స్తున్నాడు. ఇక త‌ర‌గ‌తి గ‌దిలో పాఠాలు బోధించ‌కుండా విద్యార్థుల‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డం, వారిని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించ‌డం చేస్తున్నాడు. ఇక ఇదే తంతు ప్ర‌తి రోజు కొన‌సాగుతోంది.

ఇక చేసేదేమీ లేక ఇటీవ‌ల ఉపాధ్యాయుడికి పిల్ల‌లు బుద్ధి చెప్పాల‌నుకున్నారు. మందు తాగి స్కూల్‌కు వ‌చ్చిన టీచ‌ర్‌పై విద్యార్థులంద‌రూ క‌లిసి చెప్పుల‌తో దాడి చేశారు. దీంతో టీచ‌ర్ క్ష‌ణాల్లోనే త‌న బైక్ స్టార్ట్ చేసి అక్క‌డ్నుంచి పారిపోయాడు. గేటు దాకా టీచ‌ర్‌ను పిల్ల‌లు వెంబ‌డించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ ఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ విజ‌య్ ద‌యారామ్, బ్లాక్ ఎడ్యుకేష‌న్ ఆఫీస‌ర్ తీవ్రంగా స్పందించారు. మ‌ద్యం తాగి పాఠ‌శాల‌కు వ‌స్తున్న టీచ‌ర్‌ను స‌స్పెండ్ చేయాల‌ని అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. 

Latest News