SBI బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్.. 14మంది ఘరానా మోస‌గాళ్లు అరెస్ట్

విధాత‌: SBI బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నుంచి SBI బ్యాంక్ ఉద్యోగులమంటూ అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి కోట్లు దండుకుంటున్న14 మంది ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సందర్భంగా గురువారం నాడు సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు ఢిల్లీ కేంద్రంగా నగరంలో ఎస్‌బిఐ బ్యాంకు పేరుతో నకిలీ […]

SBI బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్.. 14మంది ఘరానా మోస‌గాళ్లు అరెస్ట్

విధాత‌: SBI బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నుంచి SBI బ్యాంక్ ఉద్యోగులమంటూ అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెట్టి కోట్లు దండుకుంటున్న14 మంది ఘరానా ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ సందర్భంగా గురువారం నాడు సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు.

వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు ఢిల్లీ కేంద్రంగా నగరంలో ఎస్‌బిఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్నారనే పక్క సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు 14 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం కాల్ సెంటర్‌ ఖాతాల్లోని లక్షల రూపాయల నగదు నిలుపుదల చేశారు. దేశంలోనే అతిపెద్ద సైబర్‌ మోసాన్ని ఛేదించినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.

SBI ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రూ.వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాలను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. స్ఫూపింగ్‌ యాప్‌ ద్వారా ఎస్‌బీఐ అసలైన కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ చేస్తున్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు.

ఓ ముఠా దిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఎస్‌బీఐ నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కాల్‌సెంటర్‌ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి రూ.కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాల తీసుకొని క్రెడిట్‌కార్డు దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు.

అసలైన SBI కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు స్ఫూఫింగ్‌ యాప్‌ వాడుతున్నారని.. ఈ యాప్‌ వాడకంలో ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సీపీ తెలిపారు. 1860 180 1290 అనే నంబరును స్ఫూపింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30సెల్‌ఫోన్లు, 3ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు, 1 రూటర్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.