బండ్ల గణేష్‌పై కబ్జా కేసు నమోదు

కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై కబ్జా కేసు నమోదైంది. బండ్ల గణేష్‌ తన ఇంట్లో అద్దెకు ఉంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో 75 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. హీరా గ్రూప్‌ చైర్మన్‌

బండ్ల గణేష్‌పై కబ్జా కేసు నమోదు

విధాత, హైదరాబాద్‌ :  కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్‌పై కబ్జా కేసు నమోదైంది. బండ్ల గణేష్‌ తన ఇంట్లో అద్దెకు ఉంటూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో 75 కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని.. హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహీరా షేక్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు బండ్ల గణేష్‌పై ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

నౌహిరా షేక్‌ ఫిలింనగర్‌లోని తన ఇంటిని గణేశ్‌కు నెలకు రూ.లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చారు. అయితే కొంతకాలంగా కిరాయి ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంటిని ఖాళీ చేయాలని అడిగినందుకు ఫిబ్రవరి 15న తనను బెదిరించారని, గుండాలు, రాజకీయ నాయకుల సహాయంతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయగా, తనపైనే పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేయడంతో బండ్ల గణేశ్‌పై ఫిలింనగర్‌ పోలీసులు ఐపీసీ 341, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.