ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత టార్గెట్గా మనీలాండరింగ్ కేసులో అరెస్టయి మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖను విడుదల చేశారు
వాట్సాప్ చాట్ వెల్లడి
లావాదేవిల కోడ్ భాష నెయ్యి డబ్బాలు
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత టార్గెట్గా మనీలాండరింగ్ కేసులో అరెస్టయి మండోలి జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ జైలు నుంచి మరో లేఖను విడుదల చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కొనసాగుతున్న విచారణలో అరవింద్ కేజ్రివాల్, కవితపై మీరు జోక్యం చేసుకోవాలని కేంద్ర హోం మత్రిత్వ శాఖకు సుఖేష్ చంద్రశేఖర్ ఈ లేఖను రాశారు. తన లాయర్ మాలిక్ ద్వారా విడుదల చేసిన ఈ లేఖలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న కవిత, సత్యేంద్ర జైన్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ల మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్లు జత చేయడం సంచలనంగా మారింది. నా సిబ్బంది సూచనల మేరకు కవిత నుంచి సేకరించిన నగదు లావాదేవిలకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఉన్నాయని తెలిపారు. కవిత వద్ద నుంచి సేకరించిన నగదు సత్యేంద్ర జైన్, అరవింద్ కేజ్రివాల్లు ఢిల్లీ, గోవాకు బదిలీ చేశారని ఆరోపించారు. తాను పేర్కొన్న చాట్ లలో డబ్బును ‘నెయ్యి టిన్’ గా కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నామని, ప్రతీ టిన్ రూ.1 కోటి రూపాయలకు సమానంగా ఉందని పేర్కొన్నారు. ఈ వాట్సాప్ స్క్రీన్ షార్టులు ఈ కేసులో కవిత, సత్యేంద్ర జైన్, సీఎం కేజ్రివాల్ పూర్తి ఇన్ వాల్వ్ మెంట్ నిర్ధారిస్తాయని లేఖలో పేర్కోన్నారు. కవిత సూచనల మేరకు తన సిబ్బంది హైదరాబాద్లోని బీఆరెస్ కార్యాలయం నుంచి నగదును సేకరించారని, ప్రస్తావించిన వ్యక్తులకు సంబంధించి నా వద్ద ఉన్న అనేకమైన చాట్లలో ప్రస్తుతం పేర్కొన్న చాట్లు కొన్ని మాత్రమే అని ఇంకా చాలా అధారాలు ఉన్నాయన్నారు. కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్నందునా సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్న స్క్రీన్ షార్ట్ లు ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకునేందుకు జోక్యం చేసుకోవాలని ఈ లేఖలో రాశారు.