సైబర్ చీటర్స్ చేతిలో 40 లక్షలు మోసపోయారు. విధాత :వారిద్దరూ భార్యాభర్తలు.వ్యాపారం చేసి లైఫ్ లో సెట్ అవుదాం అనుకున్నారు.గత సంవత్సరం కోటి రూపాయలు అప్పు చేసి వ్యాపారం స్టార్ట్ చేశారు.లాక్ డౌన్ రావడంతో వ్యాపారం దివాళా తీసింది.అప్పు కట్టడం కోసం వారు తీసుకున్న నిర్ణయం హృదయ విధారకం.ఏకంగా కిడ్నీలు అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు.అందుకోసం ఆన్లైన్ లో సర్చ్ చేశారు.ఓ సైబర్ కేటుగాడు 1.2 కోట్ల రూపాయలకు కిడ్నీ కొనుగోలు చేస్తానని నమ్మించాడు.వివిధ టెస్టులు, […]
సైబర్ చీటర్స్ చేతిలో 40 లక్షలు మోసపోయారు.
విధాత :వారిద్దరూ భార్యాభర్తలు.వ్యాపారం చేసి లైఫ్ లో సెట్ అవుదాం అనుకున్నారు.గత సంవత్సరం కోటి రూపాయలు అప్పు చేసి వ్యాపారం స్టార్ట్ చేశారు.లాక్ డౌన్ రావడంతో వ్యాపారం దివాళా తీసింది.అప్పు కట్టడం కోసం వారు తీసుకున్న నిర్ణయం హృదయ విధారకం.
ఏకంగా కిడ్నీలు అమ్మి అప్పులు తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు.అందుకోసం ఆన్లైన్ లో సర్చ్ చేశారు.ఓ సైబర్ కేటుగాడు 1.2 కోట్ల రూపాయలకు కిడ్నీ కొనుగోలు చేస్తానని నమ్మించాడు.వివిధ టెస్టులు, అనుమతి కోసం అంటూ పలు చార్జీల పేరుతో 40 లక్షల రూపాయలు కాజేశారు.అనంతరం ఫోన్ ఆఫ్ రావడంతో మోసపోయామని,దిక్కుతోచని స్థితిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు ఆ దంపతులు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.