విధాత: చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్లు విధించింది. నగరాల్లో అధిక సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ఆదేశాలిచ్చింది. చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్లోని పుతియాన్ నగరవ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా హాట్స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. జియోమెన్, క్వాన్జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ప్రయాణాలపై అధికారులు ఆంక్షలు విధించారు. 2019 ఆఖరులో కరోనా వైరస్ తొలుత చైనాలోని వూహాన్లోనే బయటపడిన సంగతి తెలిసిందే. అనంతరం కొవిడ్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టిన చైనా ప్రస్తుతం కూడా అలాంటి విధానాలనే అనుసరిస్తోంది. ఇటీవలి కాలంలోనే కొత్తగా ఫుజియాన్ ప్రాంతంలో 152 కేసులు బయటపడగా.. అక్కడి ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అత్యధిక సాంక్రమికశక్తి కలిగిన డెల్టా రకంతో పాటు, మరికొన్ని వేరియంట్లు వ్యాప్తి చెందుతుండటంతో చైనా మరిన్ని చర్యలు చేపట్టింది.
కంబోడియాలో చిన్నారులకు వ్యాక్సిన్ : దేశవ్యాప్తంగా 6-11 ఏళ్ల పిల్లలకు కొవిడ్ టీకాలు వేసేందుకు కంబోడియా ఉపక్రమించింది. ఈమేరకు 18 లక్షల మంది పిల్లలకు టీకా వేయనున్నట్లు ప్రధాని హన్సేన్ తెలిపారు. 3-5 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు వేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
చైనా లో లాక్డౌన్ కొవిడ్ కేసుల పెరుగుదలతో అప్రమత్తం
<p>విధాత: చైనాలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అనేక ప్రాంతాల్లో కఠినమైన లాక్డౌన్లు విధించింది. నగరాల్లో అధిక సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు ఆదేశాలిచ్చింది. చైనా తూర్పు తీరంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫుజియాన్ ప్రావిన్స్లోని పుతియాన్ నగరవ్యాప్తంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కరోనా హాట్స్పాట్ ప్రాంతాలను పూర్తిగా మూసివేశారు. ఈ నగరంలో కొత్తగా 50 కేసులు నమోదైనట్లు జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. జియోమెన్, క్వాన్జౌలలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని […]</p>
Latest News

న్యూజీలాండ్దే రెండో వన్డే : విజేతను నిర్ణయించేది ఇక మూడో మ్యాచ్
వర్కింగ్ జర్నలిస్టులను బలి పశువులను చేయకండి
తిరుమల విమాన వెంకటేశ్వురుడికి ‘కాకబలి’ నివేదన చూడండి
గమ్యం చేరిన ఐఎన్ఎస్వీ కౌండిన్య తెర చాప నౌక
ఐకాన్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై క్రేజీ అనౌన్స్మెంట్..
మహిళలను అవమానించే కథనాలు ఆమోదయోగ్యం కాదు: సీపీ సజ్జనార్
రాజ్ కోట్ వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ 285
శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి
చైనా మాంజాకు మరొకరి బలి !
వండర్ .. కిలో మల్లెపూలు రూ.6వేలు !