Bharateeyudu2| లీకైన భార‌తీయుడు2 స్టోరీ.. ఫ‌స్ట్ పార్ట్‌ని మించి ఉందిగా..!

Bharateeyudu2| లోక నాయకుడు కమల్ హాసన్ కెరీర్‌లో ఎన్నో అత్య‌ద్భుత‌మైన చిత్రాలు చేశారు. 69 ఏళ్ల వయసులోనూ ఇంకా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల‌ని అల‌రిస్తున్నారు. అయితే క‌మ‌ల్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాలలో భార‌తీయుడు చిత్రం ఒక‌టి. 1996లో శంకర్ దర్శకత్వంలో క

  • Publish Date - April 18, 2024 / 07:15 PM IST

Bharateeyudu2| లోక నాయకుడు కమల్ హాసన్ కెరీర్‌లో ఎన్నో అత్య‌ద్భుత‌మైన చిత్రాలు చేశారు. 69 ఏళ్ల వయసులోనూ ఇంకా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల‌ని అల‌రిస్తున్నారు. అయితే క‌మ‌ల్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రాలలో భార‌తీయుడు చిత్రం ఒక‌టి. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పార్ట్‌1 సూప‌ర్ హిట్ కావ‌డంతో పార్ట్ అంత‌కి మించి ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే భార‌తీయుడు 2 చిత్ర షూటింగ్ మొద‌లై చాలా రోజులు అవుతున్నా ఇంకా మూవీ విడుద‌ల విష‌యంలో ఏ మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా న‌టిస్తుంది. అలాగే తమిళ‌ హీరో సిద్దార్థ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా స్టోరీ లీకైన‌ట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో భారతీయుడు గెటప్ లో ఉన్న కమల్ హాసన్ మళ్లీ అవినీతి మీదనే యుద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో తన ఫ్రెండ్ అవినీతికి పాల్పడడంతో దానిని క‌మ‌ల్ హాస‌న్ అంత‌మొందిస్తాడ‌ట‌. ఆ అంశాన్ని లేవ‌నెత్తుతూ సినిమాని శంక‌ర్ ఓ రేంజ్‌లో తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం.

మూవీ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా, ఎన్నిక‌లు పూర్తయ్యాక చిత్రాన్ని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. భార‌తీయుడుఫ‌స్ట్ పార్ట్‌లో లంచానికి వ్య‌తిరేకంగా పోరాడిన వీర‌శేఖ‌రన్ సేనాప‌తి ఇండియాలో మ‌ళ్లీ ఏదైన త‌ప్పు జ‌రిగితే తిరిగి వ‌స్తాన‌ని చెప్ప‌డంతో క‌థ ముగిసింది. అయితే ఇప్పుడు దేశంలో అవినీతి ఎక్కువైంద‌ని, లంచం తీసుకోకుండా ఎవరు కూడా ప‌ని చేయ‌డం లేదు. ఆ స‌మ‌యంలో భార‌తీయులు క‌మ్ బ్యాక్ ఇండియ‌న్ అంటూ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి.. దేశంలోకి భార‌తీయుడు తిరిగి అడుగు పెట్టాల‌ని రిక్వెస్టులు పంపిస్తారు. అప్పుడు వీర‌శేఖ‌ర‌న్ సేనాప‌తి ఇండియాలోకి అడుగు పెట్టి అవినీతి ప‌రుల భ‌ర‌తం ఎలా ప‌డ‌తాడ‌నేది చిత్రంలో చాలా ఆస‌క్తిగా చూపిస్తార‌ని తెలుస్తుంది.

Latest News