బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కి ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్లు లేవు. మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గతేడాది కిసీ కా భాయ్ కిసీ కి జాన్, టైగర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాలు అభిమానులని ఏ మాత్రం అలరించలేకపోయాయి. దీంతో ఈ సారి చేయబోయే సినిమాతో అయిన పెద్ద హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు సల్లూభాయ్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో కలిసి ఓ మూవీ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ మూవీకి సంబంధించి కొన్నాళ్లుగా అనేక ప్రచారాలు సాగుతున్నా దీనిపై క్లారిటీ రాలేదు. అయితే రంజాన్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ అందించారు.
ఈ సినిమాకు సికందర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ పండుగకు విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలస్తుంది. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు, టెక్నికల్ టీమ్ వివరాలు విషయాలు తెలియాల్సి ఉంది. అయితే సికిందర్ టైటిల్ను ట్విటర్ ద్వారా సల్మాన్ ఖాన్ ప్రకటిస్తూ… ”ఈ సంవత్సరం ఈద్ పండుగకు ‘బడే మియాన్ చోటే మియాన్’ ఔర్ ‘మైదాన్’ సినిమాలు చూడండి. వచ్చే ఏడాది నా సినిమా సికందర్తో కలుద్దాం. మీ అందరికీ ఈద్ ముబారక్!” అంటూ రాసుకొచ్చారు.
సల్మాన్- మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో అంటే దాదాపు రూ.400 కోట్లతో తెరకెక్కబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. గజిని, తుపాకీ, స్టాలిన్, 7th సెన్స్ వంటి సినిమాలను తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మురుగదాస్. ఆ తర్వాత మహేశ్ బాబుతో స్పైడర్, రజనీకాంత్తో దర్బార్ సినిమాలను తెరక్కించి నిరాశపరిచిన కూడా మనోడి క్రేజ్ తగ్గలేదు కొన్నేళ్లపాటు ఇండస్ట్రీకి దూరమయిన ఈ డైరెక్టర్ ఇప్పుడు మళ్లీ ఇప్పుడు కొత్త కథలతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్తో సినిమాను పట్టాలెక్కించనున్నాడు.ఈ సినిమాతో మంచి హిట్ కొట్టి తిరిగి ఫామ్లోకి రావాలని అనుకుంటున్నాడు.