తమిళనాడు మంత్రికి 3 ఏండ్ల‌ జైలు శిక్ష‌

అవినీతి కేసులో తమిళనాడు సీనియ‌ర్ మంత్రి కే పాండ్‌మూడికి గురువారం మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది

తమిళనాడు మంత్రికి 3 ఏండ్ల‌ జైలు శిక్ష‌
  • అవినీతి కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పు
  • తీర్పు అమ‌లును 30 రోజులు నిలిపివేత‌
  • సుప్రీంకోర్టులో అప్పీల్‌కు అనుమ‌తి


విధాత : అవినీతి కేసులో తమిళనాడు సీనియ‌ర్ మంత్రి కే పాండ్‌మూడికి గురువారం మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 1.75 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కే పాండ్‌మూడి, ఆయన భార్యను దోషులుగా నిర్ధారిస్తూ రెండు రోజుల క్రితం ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది.


అతని జైలు శిక్షను 30 రోజులపాటు సస్పెండ్ హైకోర్టు చేసింది. అతను తన నేరాన్ని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి అనుమతించింది. అవినీతి కేసులో పాండ్‌మూడి దోషిగా తేలిన అనంత‌రం మంత్రి పదవి నుంచి ఆయ‌నను తొల‌గించారు. ఆయ‌న‌కు ఉన్న ఉన్నత విద్యా శాఖను మరొక క్యాబినెట్ మంత్రి అప్పగించే అవకాశం ఉన్న‌ది. చట్టం ప్రకారం.. చట్టసభల సభ్యులు కోర్టు దోషులుగా నిర్ధారిస్తే వారు పార్లమెంటు లేదా అసెంబ్లీకి అనర్హులు అవుతారు.


ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను తన మంత్రివర్గం నుంచి పాండ్‌ముడిని తప్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవికి సిఫార‌సు చేసిన మరుసటి రోజే ఆయనకు శిక్ష ఖరారు కావ‌డం విశేషం. ఈ కేసు డీఎంకే అధికారంలో 2006-2011 హయాం నాటిది. దోషిగా తేలిన పాండ్‌మూడి రూ. 1.36 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టాడు. 2011లో అధికారంలోకి వచ్చిన ప్రత్యర్థి అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణలో నేరం రుజువు కావ‌డంతో హైకోర్టును శిక్ష‌ను ఖ‌రారు చేసింది.