Uttar Pradesh | ఓ ముగ్గురు వ్యక్తులు కామంతో చెలరేగిపోయారు. క్రూర మృగాల్లా ప్రవర్తించారు. ఓ వ్యక్తిని మంచానికి కట్టేశారు. ఆ తర్వాత అతని భార్య, కూతురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని రామ్పుర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రామ్పుర్ జిల్లాలోని సైఫాని పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మెకానిక్ తన భార్య, కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. అయితే శనివారం రాత్రి ఆ మెకానిక్ ఇంట్లోకి గుర్తు తెలియని ముగ్గురు […]
Uttar Pradesh | ఓ ముగ్గురు వ్యక్తులు కామంతో చెలరేగిపోయారు. క్రూర మృగాల్లా ప్రవర్తించారు. ఓ వ్యక్తిని మంచానికి కట్టేశారు. ఆ తర్వాత అతని భార్య, కూతురిపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని రామ్పుర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రామ్పుర్ జిల్లాలోని సైఫాని పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మెకానిక్ తన భార్య, కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. అయితే శనివారం రాత్రి ఆ మెకానిక్ ఇంట్లోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు చొరబడ్డారు. ఇక మెకానిక్ను మంచానికి కట్టేశారు. అతని కళ్లెదుటే భార్య, కుమార్తె(మైనర్)పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి, క్రూరమృగాల్లా ప్రవర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తల్లీకూతుళ్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మెకానిక్తో ఓ ముగ్గురు వ్యక్తులు ఇటీవలే గొడవ పడ్డారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు. ఆ ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.