విధాత: జాతీయస్థాయిలో మహిళ స్నేహపూర్వక పంచాయతీ అవార్డు తోపాటు కోటి నగదును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సూర్యాపేట అదనపు కలెక్టర్ హేమంత పాటిల్ కేశవ్, గ్రామ సర్పంచ్ సానుబోయిన రజిత, పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు వారికి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో వెబ్ఎక్స్ ద్వారా ఢిల్లీలో పంచాయతీరాజ్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం […]
విధాత: జాతీయస్థాయిలో మహిళ స్నేహపూర్వక పంచాయతీ అవార్డు తోపాటు కోటి నగదును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ నందు నిర్వహించిన కార్యక్రమంలో సూర్యాపేట అదనపు కలెక్టర్ హేమంత పాటిల్ కేశవ్, గ్రామ సర్పంచ్ సానుబోయిన రజిత, పంచాయతీ కార్యదర్శి ఎలక ఉమారాణి అందుకున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో వెబ్ఎక్స్ ద్వారా ఢిల్లీలో పంచాయతీరాజ్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని లైవ్ లో ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావుతో కలిసి జిల్లా అధికారులందరూ కరతాల ధ్వనులతో శుభాకాంక్షలు తెలిపారు.
ఏపూర్ గ్రామాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి దత్తత తీసుకొని గ్రామాన్ని పలు రంగాలలో అభివృద్ధి పరిచి జాతీయ అవార్డు రావడానికి కృషి చేశారంటూ మంత్రికి, ఉద్యోగులకి జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పంచాయతీ అధికారి ఎన్.యాదయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.