Adilabad విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: అకాల వర్షంకు తడిసిన దాన్యంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కి రైతుల రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లు లేక రైతుల అవస్థలు పడ్డారు. కాంటా వేసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు. కొనుగోల్ కేంద్రాల వద్ద సమీపంలోని రహదారిపై రైతుల రాస్తారోకో చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్, భాదన్ కుర్తి గ్రామాలకు చెందిన వరి కొనుగోలు కేంద్రాల్లో కూలీలు, లారీలు […]
Adilabad
విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: అకాల వర్షంకు తడిసిన దాన్యంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కి రైతుల రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రాల్లో లారీ లు లేక రైతుల అవస్థలు పడ్డారు. కాంటా వేసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు. కొనుగోల్ కేంద్రాల వద్ద సమీపంలోని రహదారిపై రైతుల రాస్తారోకో చేశారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్, భాదన్ కుర్తి గ్రామాలకు చెందిన వరి కొనుగోలు కేంద్రాల్లో కూలీలు, లారీలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.. కాంటా వేసిన వరి ధాన్యం కూడా తరలించడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.. అకాల వర్షంతో వరి ధాన్యనికి మొలకలు రావడంతో.. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అర్ధగంట సేపు రైతులు రాస్తారోకో ధర్నా చేపట్టారు.. హుటాహుటిన SI చేరుకొని రైతులతో ఎమ్మార్వో కు చరవాని ద్వారా మాట్లాడడంతో .. లారీలను పంపించి తడిసిన ధన్యాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు..
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… మంత్రులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో అమలు కావడం లేదని మండిపడ్డారు. రైతులను పట్టించుకోని ప్రభుత్వానికి ఓట్లు అడిగే అర్హత కోల్పోయారని, కేవలం రైతు బంధు 10వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని , రైతులు అంతకన్నా ఎక్కువ నష్టపోతున్నారని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల అవస్థలు పట్టించుకునే నాధుడే కరువయ్యారని రైతులు తమ ఆవేదనను వ్యక్త పరిచారు…