Delhi | బైక్తో ఢీకొనడాన్ని నిలదీసినందుకు గొడవ వెనుక నుంచి కాల్పలు జరిపిన దుండగులు మేనేజర్ గిల్ మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు న్యూఢిల్లీ: బైక్ యాక్సిడెంట్తో రాజుకున్న వివాదం.. ఒకరి హత్యకు దారి తీసింది. రాజధాని ఢిల్లీలో అమెజాన్ కంపెనీకి చెందిన ఒక సీనియర్ మేనేజర్ను ఐదుగురు యువకులు హత్య చేశారు. దుండగులు జరిపిన కాల్పుల్లో హర్ప్రీత్ గిల్ అనే ఈ 36 ఏళ్ల మేనేజర్ తలలోంచి బుల్లెట్లు దూసుకుపోయాయని పోలీసులు తెలిపారు. హర్ప్రీత్ గిల్.. […]
Delhi |
న్యూఢిల్లీ: బైక్ యాక్సిడెంట్తో రాజుకున్న వివాదం.. ఒకరి హత్యకు దారి తీసింది. రాజధాని ఢిల్లీలో అమెజాన్ కంపెనీకి చెందిన ఒక సీనియర్ మేనేజర్ను ఐదుగురు యువకులు హత్య చేశారు. దుండగులు జరిపిన కాల్పుల్లో హర్ప్రీత్ గిల్ అనే ఈ 36 ఏళ్ల మేనేజర్ తలలోంచి బుల్లెట్లు దూసుకుపోయాయని పోలీసులు తెలిపారు.
హర్ప్రీత్ గిల్.. భజన్పురాలోని ఒకటో నంబరు వీధిలో నివాసముంటున్నారు. నెత్తుటి మడుగులో పడి ఉన్న గిల్ను చుట్టుపక్కల వారు హాస్పిటల్కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయనతోపాటే బైక్పై ఉన్న గోవిందాకు కూడా తలలో బుల్లెట్ గాయం అయింది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు తరలించారు.
గిల్కు గోవిందా మామ అవుతారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న బిలాల్ గనీ అలియాస్ మల్లూ (18) అనే యువకున్ని పోలీసులు రాత్రి 2 గంటల ప్రాంతంలో సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద అరెస్టు చేశారు. తన నలుగురు స్నేహితులతో కలిసి అతడు ఈ హత్యలో పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నది. రాత్రి 12 గంటల ప్రాంతంలో గిల్, గోవింద బైక్పై ఇంటి నుంచి బయటకు వచ్చారు.
కొంతసేపటికి ఒక బైక్ వీరి బైక్ను ఢీకొన్నది. ఆ సమయంలో ఉభయపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. అనంతరం గిల్, గోవిందా బైక్పై వెళ్లిపోతున్నా.. వారిని రెండు బైక్లపై యువకులు అనుసరించారు. మరోసారి ఉభయ పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. ఆ సమయంలో ముసుగు ధరించిన ఇద్దరు యువకులు వెనుక నుంచి గిల్, గోవిందాపై కాల్పులు జరిపారు. నిందితులను పట్టుకోవడానికి ఆరు టీమ్లను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు జరుపుతున్నారు.